‘అజ్ఞాతవాసి’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ అభిమానులకు రెండేళ్లు చాలా భారంగా గడిచాయి. పవన్ రెండేళ్ల పాటు రాజకీయాలకే అంకితం అయిపోవడంతో ఒక్క సినిమా అప్ డేట్ లేదు. వేరే హీరోల అభిమానుల పుట్టిన రోజులకు సినీ విశేషాలతో సంబరాలు సాగుతుంటే.. పవన్ ఫ్యాన్స్కు అదేమీ లేక తెగ ఇబ్బంది పడిపోయారు.
కానీ వాళ్లను ఇంకెంతో కాలం నిరాశలో ఉంచకుండా గత ఏడాది చివర్లో రీఎంట్రీ సినిమాను మొదలుపెట్టేశాడు పవన్. ఒకటికి రెండు సినిమాలు చేస్తూ, ఇంకో సినిమాను ఓకే చేయడంతో మొత్తం మూడు సినిమాలు లైన్లోకి వచ్చేశాయి. ఇంతలో పవన్ పుట్టిన రోజు వచ్చేసింది.
గత రెండేళ్లు అనావృష్టితో ఉన్న వాళ్లకు.. ఇప్పుడు అతివృష్టి అన్నట్లుగా తయారైంది. మొన్న చిరంజీవి పుట్టిన రోజుకు ఎంతో ఆశిస్తే ఆల్రెడీ ఖరారైన ‘ఆచార్య’ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఒక మోషన్ పోస్టర్తో సరిపెట్టారు. మరే కొత్త సినిమాల అప్ డేట్స్ ఇవ్వలేదు.
కానీ ఇలా పుట్టిన రోజుకు అభిమానులకు కానుకలు ఇవ్వాలి.. వాళ్లను ఖుషీ చేయాలి అని పవన్ ఆలోచించే రకం కాదు కానీ.. ఆయన పుట్టిన రోజు నాడు సందడి మామూలుగా ఉండేలా లేదు. ఆయన నటిస్తున్న ‘వకీల్ సాబ్’తో పాటు నటించబోయే హరీష్ శంకర్ సినిమా అప్డేట్లు రెడీ అయిపోయాయి. హరీష్-పవన్ సినిమా గురించి రేపు సాయంత్రం 4.05 గంటలకు అప్ డేట్ ఇవ్వనున్నారు. అది టైటిల్ ప్రకటనగా భావిస్తున్నారు.
ఇక ఆల్రెడీ ‘వకీల్ సాబ్’ మోషన్ టీజర్ వస్తుందన్న సంకేతాలు రాగా.. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఉదయం 9.09 గంటలకు ఈ విశేషం బయటికి రానుంది. ఇక క్రిష్ సినిమాకు సంబంధించి కూడా ఏదైనా విశేషాన్ని పంచుకుంటే పవన్ అభిమానుల సంబరాలకు అంతే ఉండదు. మరోవైపు ట్విట్టర్లో అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే ట్రెండ్తోనే రికార్డు కొట్టిన పవన్ అభిమానులు.. ఇప్పుడు పుట్టిన రోజుకు 100 మిలియన్ టార్గెట్తో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ట్రెండ్ మొదలుపెడుతుండటం విశేషం.
This post was last modified on September 1, 2020 5:11 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…