లీకైనట్టే కళ్యాణ్ రామ్ డెవిల్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. డిసెంబర్ 29 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. అంటే సరిగ్గా ఇంకో ఇరవై రెండు రోజులన్న మాట. నిజానికి సలార్, డంకీలు వచ్చిన వారానికే ఈ రిస్క్ చేయడం పట్ల పలు అనుమానాలు తలెత్తాయి కానీ జనవరి నుంచి మార్చి దాకా సరైన డేట్లు ఖాళీ లేకపోవడం చూస్తే డెవిల్ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పాలి. లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ స్పై డ్రామాకు నిర్మాత అభిషేక్ అగర్వాలే దర్శకత్వం వహించారు.
నిజానికి దీని మొదటి డైరెక్టర్ నవీన్ మేడారం గురించిన క్లారిటీ ఇప్పటికీ సరైన రీతిలో బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో డెవిల్ ప్రమోషన్ల కోసం టీమ్ ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తుంది. అప్పుడు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో బహుశా అభిషేక్ నామా ముందుగానే ప్రిపేరయ్యుంటారు. కళ్యాణ్ రామ్ నెలల తరబడి బయట కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడంతో మొదలుపెట్టి బెయిలు మీద బయటికి రావడం దాకా ఎక్కడా స్పందించలేదు. సరే ఇది రాజకీయ కోణమనుకున్నా కనీసం ఏదైనా ఇతర సినిమా ఈవెంట్లకు హాజరైన దాఖలాలు లేవు.
ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ దొరకలేదు. డెవిల్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇటీవలే యానిమల్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ బ్రాండ్ ఈసారి పబ్లిసిటీకి ఉపయోగపడనుంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. 29న బబుల్ గమ్ తప్ప పెద్దగా చెప్పుకునే పోటీ ఏదీ లేదు. ఆపై సంక్రాంతి దాకా ఎంతలేదన్నా 13 రోజుల టైం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కళ్యాణ్ రామ్ కి అంత టైం చాలు. పాజిటివ్ టాక్ వస్తే రికవరీ జరిగిపోతుంది. బిజినెస్ ఎంతకు క్లోజ్ చేస్తారనేది చూడాలి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…