లీకైనట్టే కళ్యాణ్ రామ్ డెవిల్ విడుదల తేదీని లాక్ చేసుకుంది. డిసెంబర్ 29 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత ప్రకటించారు. అంటే సరిగ్గా ఇంకో ఇరవై రెండు రోజులన్న మాట. నిజానికి సలార్, డంకీలు వచ్చిన వారానికే ఈ రిస్క్ చేయడం పట్ల పలు అనుమానాలు తలెత్తాయి కానీ జనవరి నుంచి మార్చి దాకా సరైన డేట్లు ఖాళీ లేకపోవడం చూస్తే డెవిల్ తీసుకున్న నిర్ణయం సబబేనని చెప్పాలి. లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ పీరియాడిక్ స్పై డ్రామాకు నిర్మాత అభిషేక్ అగర్వాలే దర్శకత్వం వహించారు.
నిజానికి దీని మొదటి డైరెక్టర్ నవీన్ మేడారం గురించిన క్లారిటీ ఇప్పటికీ సరైన రీతిలో బయటికి రాలేదు. ఈ నేపథ్యంలో డెవిల్ ప్రమోషన్ల కోసం టీమ్ ఖచ్చితంగా మీడియా ముందుకు వస్తుంది. అప్పుడు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలో బహుశా అభిషేక్ నామా ముందుగానే ప్రిపేరయ్యుంటారు. కళ్యాణ్ రామ్ నెలల తరబడి బయట కనిపించడం లేదు. చంద్రబాబునాయుడు అరెస్ట్ కావడంతో మొదలుపెట్టి బెయిలు మీద బయటికి రావడం దాకా ఎక్కడా స్పందించలేదు. సరే ఇది రాజకీయ కోణమనుకున్నా కనీసం ఏదైనా ఇతర సినిమా ఈవెంట్లకు హాజరైన దాఖలాలు లేవు.
ఇటీవలే తెలంగాణ ఎన్నికల్లో ఓటేయడానికి వచ్చినప్పుడు మళ్ళీ దొరకలేదు. డెవిల్ భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఇటీవలే యానిమల్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ బ్రాండ్ ఈసారి పబ్లిసిటీకి ఉపయోగపడనుంది. ఎన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. 29న బబుల్ గమ్ తప్ప పెద్దగా చెప్పుకునే పోటీ ఏదీ లేదు. ఆపై సంక్రాంతి దాకా ఎంతలేదన్నా 13 రోజుల టైం దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో కళ్యాణ్ రామ్ కి అంత టైం చాలు. పాజిటివ్ టాక్ వస్తే రికవరీ జరిగిపోతుంది. బిజినెస్ ఎంతకు క్లోజ్ చేస్తారనేది చూడాలి.
This post was last modified on December 7, 2023 6:37 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్`…
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…