సెప్టెంబర్లో కూడా సినిమా థియేటర్లు తెరవడానికి వీల్లేదని కేంద్రం ఆజ్ఞాపించడంతో థియేటర్లను కాపాడాలంటూ సోషల్ మీడియాలో హాష్ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. దేశంలో అన్నిటినీ తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చి సినిమా థియేటర్లను మాత్రం ఎందుకని మూసేసి వుంచారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే థియేటర్లు తెరుచుకోకపోవడం పట్ల సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందనలు లేవు.
థియేటర్లు తెరవాలంటూ సినిమా పెద్దలెవరూ డిమాండ్ చేయడం లేదు. రెండు నెలల క్రితం వరకు నిర్మాతలు సినిమా థియేటర్లు ఓపెన్ చేయాలనే డిమాండ్తో వున్నారు. కానీ ఇప్పుడు ఓటిటి నుంచి మంచి రాబడి వస్తుండడంతో నిర్మాతలు థియేట్రికల్ బిజినెస్ కోసం చూడడం లేదు. పూర్తయిన సినిమాలే కాదు, పూర్తి కాని సినిమాలకు కూడా ఓటిటితో ఒప్పందాలు చేసుకుంటున్నారు.
అంటే రేపు థియేటర్లు ఓపెన్ అయినా కానీ ఇష్టం వున్న వాళ్లే థియేటర్లకు వెళతారు… లేని వాళ్లు ఇంట్లోనే చూసుకుంటారనే ధోరణిలో వున్నారు. సినిమా ఎగ్జిబిటర్లు, సినిమాల మీదే బ్రతికే క్యాంటీన్, సైకిల్ స్టాండ్ వాళ్లు, చివరకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇప్పుడు చాలా దారుణమయిన అవస్థలు పడుతున్నారు.
అయితే వారి తరఫున సినిమా పరిశ్రమ నుంచి పెద్ద గొంతుకలు వినిపిస్తే తప్ప ప్రభుత్వం చెవిన పడదు. కానీ పాపం వాళ్ల కష్టాలను ఇప్పుడయితే ఎవరూ గుర్తించడం లేదు. ఓ విధంగా ఓటిటిలు వచ్చి సినిమా బిజినెస్పై ఆధారపడ్డ వాళ్ల నోళ్లలో మట్టి కొట్టినట్టే.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…