గత నెలలో వచ్చిన మ్యాడ్ అనే చిన్న సినిమాకు ఒక వెరైటీ ఆఫర్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. జాతిరత్నాలు మూవీలో కంటే మ్యాడ్ మూవీకి తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని అతను సవాల్ చేశాడు. అయితే మ్యాడ్ మూవీలో కామెడీ బాగానే ఉండడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా కంప్లైంట్స్ లేకపోయాయి. లేదంటే నాగ వంశీ మాటలు పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయేవేమో. ఇప్పుడు మరో ఫిలిం సెలబ్రిటీ తన సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఇలాంటి ఛాలెంజే చేశాడు. అతను ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. మ్యాడ్ సినిమాను గుర్తుచేస్తూ అతనీ ఛాలెంజ్ చేయడం విశేషం.
తన కొత్త చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రెస్ మీట్లో నితిన్ మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నిర్మాత నాగ వంశీ అన్నాడని.. తాను కూడా ఎక్స్ట్రా విషయంలో అలాంటి సవాలే చేస్తున్నానని.. ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు నాగ వంశీనే వాపస్ ఇస్తాడని.. ఆయనకి తనకు చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్ నవ్వుతూ అన్నాడు. కాగా ఈ వీడియోకు సంబంధించిన ట్వీట్ మీద నాగ వంశీ స్పందిస్తూ.. ఆ రోజేదో మ్యాడ్ సినిమా వైబ్ లో అలా అన్నానని.. తనను లాక్ చేస్తే ఎలా అని ఒక కామెడీ ఇమేజ్ తో రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
మరి ‘నవ్వకుంటే టికెట్ డబ్బులు వాపస్’ సెంటిమెంట్ మరోసారి పనిచేసే మ్యాడ్ లాగే ఎక్స్ట్రా కూడా మంచి హిట్ అవుతుందేమో చూడాలి. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 2, 2023 11:55 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…