గత నెలలో వచ్చిన మ్యాడ్ అనే చిన్న సినిమాకు ఒక వెరైటీ ఆఫర్ ఇచ్చాడు నిర్మాత నాగ వంశీ. జాతిరత్నాలు మూవీలో కంటే మ్యాడ్ మూవీకి తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వాపస్ ఇచ్చేస్తానని అతను సవాల్ చేశాడు. అయితే మ్యాడ్ మూవీలో కామెడీ బాగానే ఉండడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా కంప్లైంట్స్ లేకపోయాయి. లేదంటే నాగ వంశీ మాటలు పెద్ద ట్రోల్ మెటీరియల్ లాగా మారిపోయేవేమో. ఇప్పుడు మరో ఫిలిం సెలబ్రిటీ తన సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో ఇలాంటి ఛాలెంజే చేశాడు. అతను ఎవరో కాదు యంగ్ హీరో నితిన్. మ్యాడ్ సినిమాను గుర్తుచేస్తూ అతనీ ఛాలెంజ్ చేయడం విశేషం.
తన కొత్త చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ప్రెస్ మీట్లో నితిన్ మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు వాపస్ ఇస్తానని నిర్మాత నాగ వంశీ అన్నాడని.. తాను కూడా ఎక్స్ట్రా విషయంలో అలాంటి సవాలే చేస్తున్నానని.. ఈ సినిమా చూసి ప్రేక్షకులు నవ్వకపోతే టికెట్ డబ్బులు నాగ వంశీనే వాపస్ ఇస్తాడని.. ఆయనకి తనకు చాలా లావాదేవీలు ఉన్నాయని నితిన్ నవ్వుతూ అన్నాడు. కాగా ఈ వీడియోకు సంబంధించిన ట్వీట్ మీద నాగ వంశీ స్పందిస్తూ.. ఆ రోజేదో మ్యాడ్ సినిమా వైబ్ లో అలా అన్నానని.. తనను లాక్ చేస్తే ఎలా అని ఒక కామెడీ ఇమేజ్ తో రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
మరి ‘నవ్వకుంటే టికెట్ డబ్బులు వాపస్’ సెంటిమెంట్ మరోసారి పనిచేసే మ్యాడ్ లాగే ఎక్స్ట్రా కూడా మంచి హిట్ అవుతుందేమో చూడాలి. వక్కంతం వంశీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…
రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…