నిన్న ఉదయం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ లో యానిమల్ హంగామా నడుస్తుండగా.. సాయంత్రానికి మొత్తం ఫోకస్ సలార్ ట్రైలర్ మీదికి మళ్ళింది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంటే ఇదే అని చెప్పాలి. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సలార్ రిలీజ్ ఆలస్యమైనా కూడా హైపు పెరిగిందే తప్ప తగ్గలేదు. బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది.
ట్రైలర్ తర్వాత హైప్ ఇంకో స్థాయికి చేరుతుందని అనుకుంటే.. ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఆల్రెడీ బాహుబలి తర్వాత ప్రభాస్ మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న సలార్ కూడా అటూ ఇటూ అయిందంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అయితే ట్రైలర్ చూసి సలార్ విషయంలో విషయంలో మరీ కంగారు పడాల్సిన అవసరం లేదని గత అనుభవం చాటి చెబుతోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్ 2 ట్రైలర్ కు కూడా అంత మంచి రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఏముంది ఇందులో అన్నట్లుగా పెదవి విరిచారు. అంతకు ముందు వచ్చిన టీజర్ తో పోలిస్తే ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సినిమాకు కూడా తొలి రోజు మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా కూడా ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ సినిమాలకు ఉన్న సానుకూలత ఇదే.
ప్రశాంత్ నీల్ తన మార్కు ఎలివేషన్స్ సీన్లతో ప్రభాస్ ను అభిమానులు మాస్ ప్రేక్షకులు మెచ్చేటట్లు చూపించగలిగితే.. సినిమా పైసా వసూల్ అనిపిస్తే చాలు. కథ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. చూద్దాం మరి క్రిస్మస్ వీకెండ్లో ఏం జరుగుతుందో?
This post was last modified on December 2, 2023 11:24 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…