నిన్న ఉదయం నుంచి ఇండియన్ బాక్సాఫీస్ లో యానిమల్ హంగామా నడుస్తుండగా.. సాయంత్రానికి మొత్తం ఫోకస్ సలార్ ట్రైలర్ మీదికి మళ్ళింది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంటే ఇదే అని చెప్పాలి. ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులే కాక సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సలార్ రిలీజ్ ఆలస్యమైనా కూడా హైపు పెరిగిందే తప్ప తగ్గలేదు. బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది.
ట్రైలర్ తర్వాత హైప్ ఇంకో స్థాయికి చేరుతుందని అనుకుంటే.. ఎక్కువగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో ఒక రకమైన ఆందోళన నెలకొంది. ఆల్రెడీ బాహుబలి తర్వాత ప్రభాస్ మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్నాడు. బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్న సలార్ కూడా అటూ ఇటూ అయిందంటే ఇక అంతే సంగతులు. అందుకే ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
అయితే ట్రైలర్ చూసి సలార్ విషయంలో విషయంలో మరీ కంగారు పడాల్సిన అవసరం లేదని గత అనుభవం చాటి చెబుతోంది. ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజిఎఫ్ 2 ట్రైలర్ కు కూడా అంత మంచి రెస్పాన్స్ ఏమీ రాలేదు. ఏముంది ఇందులో అన్నట్లుగా పెదవి విరిచారు. అంతకు ముందు వచ్చిన టీజర్ తో పోలిస్తే ట్రైలర్ అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సినిమాకు కూడా తొలి రోజు మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా కూడా ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లతో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మాస్ సినిమాలకు ఉన్న సానుకూలత ఇదే.
ప్రశాంత్ నీల్ తన మార్కు ఎలివేషన్స్ సీన్లతో ప్రభాస్ ను అభిమానులు మాస్ ప్రేక్షకులు మెచ్చేటట్లు చూపించగలిగితే.. సినిమా పైసా వసూల్ అనిపిస్తే చాలు. కథ కొంచెం అటు ఇటుగా ఉన్నా ఇబ్బంది ఉండదు. ఓపెనింగ్స్ తోనే బాక్సాఫీస్ షేక్ అయిపోతుంది. చూద్దాం మరి క్రిస్మస్ వీకెండ్లో ఏం జరుగుతుందో?
This post was last modified on December 2, 2023 11:24 pm
ఆంధ్రకింగ్ తాలూకా ఫైనల్ రన్ అయిపోయింది. పాజిటివ్ రివ్యూలు, బాగుందని చెప్పిన పబ్లిక్ టాక్స్ ఇవేవి పట్టుమని మూడు వారాల…
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విలన్ గా నటించిన బండి సరోజ్ కుమార్ సెన్సార్ బోర్డుని…
టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జీతాల్లో కోత పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏటా ఆటగాళ్లకు…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ప్రముఖ సినీ నటులు నాగార్జున, సమంత, నాగ చైతన్యలపై…
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…