ఇవాళ విడుదలైన యానిమల్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒక వర్గానికి నచ్చగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్ వినిపిస్తున్నారు. ఫైనల్ గా తేల్చాల్సింది బాక్సాఫీస్ కాబట్టి ఓ రెండు మూడు రోజులు ఆగి అప్పుడు వచ్చే కలెక్షన్లను బట్టి స్థాయిని డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు కావడం ఖాయం. అడ్వాన్స్ బుకింగ్స్ లో ముంబై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ బుకింగ్స్ ఫాస్ట్ గా ఉండటం గమనించాల్సిన విషయం. వీకెండ్ దాకా ఈ జోరు ఖాయంగా ఉంటుంది.
చివర్లో ఎండ్ టైటిల్స్ పడ్డాక ఒక ట్విస్టు ఉంటుందని అది మిస్ కావొద్దని సందీప్ వంగాతో పాటు టీమ్ ప్రత్యేకంగా చెప్పిన సంగతి తెలిసిందే. పెద్దగా దాచేంత సస్పెన్స్ ఏమి కాదు కానీ అనిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ ఉంటుందనే హింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేరు ప్రస్తావించకూడని ఒక సర్ప్రైజ్ బాలీవుడ్ ఆర్టిస్టుతో చేయించిన స్పెషల్ క్యామియో ఊహించని రేంజ్ లో డిజైన్ చేశారు. జురాసిక్ పార్క్ లో ఎలా అయితే డైనోసార్లు విధ్వంసం సృష్టించాయో అదే తరహాలో అనిమల్ పార్క్ లో హీరోలు విలన్ల కలిసి అంత రేంజ్ లో రక్తపాతం సృష్టించబోతున్నారన్న మాట .
ఇది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. ముందు ప్రభాస్ స్పిరిట్ మొదలు కావాలి. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. దానికో రెండేళ్ల నిర్మాణం అనుకున్నా తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాలి. ఇదంతా జరిగేలోపు 2028 వస్తుంది. ఆ తర్వాత అనిమల్ పార్క్ ని తీయాలనుకున్నా చాలా సమయం ఎదురు చూడాలి. అయితే ఇప్పుడొచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ ని మించి అనే రేంజ్ లో ఆడి కెజిఎఫ్ లాగా పేరు తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. రన్బీర్ కపూర్ తో సహా టీమ్ మొత్తం సిద్ధంగానే ఉంది కానీ ఎటొచ్చి సందీప్ వంగా డైరీనే ఖాళీగా లేదు మరి.
This post was last modified on December 1, 2023 3:34 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…