ఇవాళ విడుదలైన యానిమల్ కు మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఒక వర్గానికి నచ్చగా మరికొందరు సెకండ్ హాఫ్ కంప్లయింట్ వినిపిస్తున్నారు. ఫైనల్ గా తేల్చాల్సింది బాక్సాఫీస్ కాబట్టి ఓ రెండు మూడు రోజులు ఆగి అప్పుడు వచ్చే కలెక్షన్లను బట్టి స్థాయిని డిసైడ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఓపెనింగ్స్ భీభత్సంగా వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ ఫిగర్లు నమోదు కావడం ఖాయం. అడ్వాన్స్ బుకింగ్స్ లో ముంబై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ బుకింగ్స్ ఫాస్ట్ గా ఉండటం గమనించాల్సిన విషయం. వీకెండ్ దాకా ఈ జోరు ఖాయంగా ఉంటుంది.
చివర్లో ఎండ్ టైటిల్స్ పడ్డాక ఒక ట్విస్టు ఉంటుందని అది మిస్ కావొద్దని సందీప్ వంగాతో పాటు టీమ్ ప్రత్యేకంగా చెప్పిన సంగతి తెలిసిందే. పెద్దగా దాచేంత సస్పెన్స్ ఏమి కాదు కానీ అనిమల్ పార్క్ పేరుతో సీక్వెల్ ఉంటుందనే హింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ పేరు ప్రస్తావించకూడని ఒక సర్ప్రైజ్ బాలీవుడ్ ఆర్టిస్టుతో చేయించిన స్పెషల్ క్యామియో ఊహించని రేంజ్ లో డిజైన్ చేశారు. జురాసిక్ పార్క్ లో ఎలా అయితే డైనోసార్లు విధ్వంసం సృష్టించాయో అదే తరహాలో అనిమల్ పార్క్ లో హీరోలు విలన్ల కలిసి అంత రేంజ్ లో రక్తపాతం సృష్టించబోతున్నారన్న మాట .
ఇది కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. ముందు ప్రభాస్ స్పిరిట్ మొదలు కావాలి. సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్తుంది. దానికో రెండేళ్ల నిర్మాణం అనుకున్నా తర్వాత అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేయాలి. ఇదంతా జరిగేలోపు 2028 వస్తుంది. ఆ తర్వాత అనిమల్ పార్క్ ని తీయాలనుకున్నా చాలా సమయం ఎదురు చూడాలి. అయితే ఇప్పుడొచ్చిన యానిమల్ బ్లాక్ బస్టర్ ని మించి అనే రేంజ్ లో ఆడి కెజిఎఫ్ లాగా పేరు తెచ్చుకుంటేనే సాధ్యమవుతుంది. రన్బీర్ కపూర్ తో సహా టీమ్ మొత్తం సిద్ధంగానే ఉంది కానీ ఎటొచ్చి సందీప్ వంగా డైరీనే ఖాళీగా లేదు మరి.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…