పెద్ద హీరోల సినిమాలు ముఖ్యంగా అవుట్ డోర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు వాటి లీకులను అదుపు చేయడం నిర్మాతలకు తలకు మించిన భారంగా మారుతోంది. గేమ్ చేంజర్ ఏకంగా ఆడియో సాంగ్ రిలీజై సంచలనం రేపగా గుంటూరు కారం నుంచి మహేష్ బాబు, వెన్నెల కిషోర్ మధ్య జరిగే సీన్ తాలూకు చిన్న బిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాజాగా ఫ్యామిలీ స్టార్ కూడా దీని బారిన పడాల్సి వచ్చింది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఒక పెళ్లి పాటను ఢిల్లీలో తీశారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తో పాటు ఇందులో స్పెషల్ క్యామియో చేస్తున్న రష్మిక మందన్న అందులో పాల్గొంది.
ఫ్యామిలీ స్టార్ లో రష్మిక గెస్టుగా చేసిందనే విషయం మొన్నటిదాకా పుకారుగానే ఉంది. ఇప్పుడీ వీడియో పుణ్యమాని కన్ఫర్మ్ చేసినట్టే. ఇలాంటివి సర్ప్రైజ్ గా ప్లాన్ చేస్తే బాగుంటుంది కానీ ఇలా లీకుల రూపంలో ముందే తెలిసిపోతే థ్రిల్ తగ్గిపోతుంది. ఎంత చిన్న బిట్ అయినా సరే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రపంచంలో దాని ప్రభావం పెద్దగా ఉంటోంది. రాజమౌళి లాంటి వాళ్ళు సైతం తీవ్రంగా కట్టడి చేయాలని చూసి విఫలమైన సందర్భాలున్నాయి. సరే ఫ్యామిలీ స్టార్ టీమ్ దీన్ని సీరియస్ గా తీసుకుంటుందో లేదో కానీ మిగిలినవాళ్లు మాత్రం అలెర్ట్ గా ఉండటం అవసరం.
సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ దర్శకుడు పరశురామ్ షూటింగ్ స్పీడ్ ని తగ్గించలేదు. ముందే ఆర్టిస్టుల డేట్లు తీసుకోవడంతో అవి వృథా కాకుండా ఇండియాలో పూర్తి చేయాల్సిన ఎపిసోడ్లు, పాటలు అన్నీ కానిస్తున్నారు. ఫారిన్ షెడ్యూల్ ఒకటే బ్యాలన్స్ ఉంటుంది. ఒకవేళ టైంకి వీసాలు దొరికి ఉంటే అయ్యేది కానీ దాని వల్ల చివరి నిమిషం దాకా పండగ రిలీజ్ ట్రై చేసి ఇక లాభం లేదని వదిలేసుకున్నారు. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దానికన్నా ముందు కొత్త డేట్ ని జనవరి నెలాఖరుకి సెట్ చేయాలా లేక మార్చికి వెళ్లాలా అనే ఆలోచనలో నిర్మాత దిల్ రాజు బృందం బిజీగా ఉంది.
This post was last modified on December 1, 2023 11:21 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…