ఇంకో ఇరవై నాలుగు గంటల లోపే యానిమల్ షోలు మొదలు కాబోతున్నాయి. మొట్టమొదటిసారిగా రన్బీర్ కపూర్ డబ్బింగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షో పడనుంది. అది కూడా తెల్లవారుఝామున ఆరు గంటలకు మొదలుపెడితే దాదాపు అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడటం విశేషం. షారుఖ్ ఖాన్ జవాన్ కు ఇన్నేసి స్పెషల్ ప్రీమియర్లు ఏపీ తెలంగాణలో వేయలేదన్నది వాస్తవం. అంతగా సందీప్ రెడ్డి వంగా ఫీవర్ మన యూత్ లో పెరిగిపోయింది. రన్ టైం గురించి చర్చ, అడల్ట్స్ ఓన్లీ సెన్సార్ సర్టిఫికెట్ ఇవేవీ పబ్లిక్ ని ఆపలేకపోతున్నాయి. ఇంత మేనియాకు ప్రధానంగా అయిదు కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది అర్జున్ రెడ్డితో సందీప్ వంగా ఏర్పరుచుకున్న బ్రాండ్. విజయ్ దేవరకొండ లాంటి కొత్త హీరోనే అంత అగ్రెసివ్ గా ఆవిష్కరించినోడు రన్బీర్ కపూర్ లాంటి సీనియర్ మోస్ట్ స్టార్ ని ఇంకే రేంజ్ లో చూపిస్తాడోననే అంచనాలు రేగడం సహజం. రెండోది ట్రైలర్ కట్. తండ్రి సెంటిమెంట్, రివెంజ్ యాంగిల్ రెండింటిని ఓపెన్ గా చూపించేసి స్టోరీ పరంగా ఎలాంటి సస్పెన్స్ లేకుండా చేయడం. మూడోది సంగీతం. పాపా మేరీ జాన్ తో సహా డిఫరెంట్ సౌండ్ తో వినిపించిన పాటలు బాగా ఎక్కేశాయి. థియేటర్ లో చూశాక వీటి రీచ్ మరింత భారీగా ఉంటుందని మ్యూజిక్ లవర్స్ ఫీలింగ్.
నాలుగోది క్యాస్టింగ్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ లను ఎంచుకోవడంలో సందీప్ వేసిన ఎత్తుగడ మంచి ఫలితాన్ని ఇవ్వనుంది. అయిదోది రన్బీర్ కపూర్ కష్టం. హింస ప్రేమ విపరీతమైన మోతాదులో ఉన్న పాత్రను అతనెంత పరకాయ ప్రవేశం చేశాడో ట్రైలర్ లోనే అర్థమైపోయింది. ఇక విశ్వరూపం చూస్తారని దర్శకుడు ఇంటర్వ్యూలలో చెప్పడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. రేపు ఈ సమయానికి ఫస్ట్ రిపోర్ట్స్, రివ్యూలు వచ్చేసి ఉంటాయి. ఏ మాత్రం బాగుందనిపించుకున్నా వసూళ్ల మోత గ్యారెంటీ. లేదూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే జవానో పఠానో రికార్డులు ఎగిరిపోవడం ఖాయం
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…