అసలింకా షూటింగ్ మొదలుకాకుండానే ప్రభాస్ స్పిరిట్ జనాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. యానిమల్ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న సందీప్ రెడ్డి వంగాను దీని గురించి ప్రశ్నలు అడగకుండా ఎవరూ ఉండలేకపోతున్నారు. ఆయనా పూర్తిగా కంట్రోల్ చేయలేమని భావించి కొన్ని విషయాలు పంచుకుంటున్నారు. స్పిరిట్ వచ్చే సంవత్సరం సెప్టెంబర్ ప్రాంతంలో మొదలయ్యే అవకాశం ఉంది. దానికన్నా ముందు జూన్ కంతా స్క్రిప్ట్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. 2025 డిసెంబర్ లేదా ఆపై ఏడాది సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకుని నిర్మాణం జరగబోతోంది.
అర్జున్ రెడ్డిలో ప్రియురాలు, యానిమల్ లో తండ్రి మీద హీరోకుండే విపరీతమైన ప్రేమను థీమ్ గా తీసుకున్న సందీప్ వంగా స్పిరిట్ లో మాత్రం దానికి భిన్నంగా డ్యూటీ మీద హద్దులు దాటిన కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రభాస్ పాత్రను అలా తీర్చిదిద్దారట. ఈ ఒక్క విషయం ఆయన చెప్పకపోయినా దగ్గరగా ఉండే సన్నిహితుల ద్వారా వినిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే డార్లింగ్ కి ఈసారి మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ సెట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రన్బీర్ కపూర్ ఇద్దరినీ ధనవంతుల కుటుంబాల్లో సెట్ చేసిన సందీప్ వంగా ఈసారి రూటు మార్చి మధ్యతరగతికి షిఫ్ట్ అయ్యాడు.
అసలు ప్రభాస్ ని ఖాకీ చొక్కాలో ఏ రేంజ్ లో చూపిస్తాడోననే అంచనాలు అభిమానుల్లో విపరీతంగా ఏర్పడుతున్నాయి. దీనికన్నా ముందు సలార్, కల్కి, మారుతీ డైరెక్షన్లో సినిమా రిలీజవుతున్నా సందీప్ మార్కు వయొలెంట్ ఎలివేషన్లతో తమ హీరోని చూసుకోవాలని ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. ఇంకా స్క్రిప్ట్ స్టేజిలో ఉంది కాబట్టి ఇంకా క్యాస్టింగ్ తదితర వివరాలు తెలియలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం యానిమల్ కు అనిల్ కపూర్ ని తీసుకున్నట్టే స్పిరిట్ లోనూ కొందరు ప్రధాన తారాగణంగా హిందీ ఆర్టిస్టులకే తీసుకునే అవకాశం ఎక్కువ ఉందట. స్పిరిట్ తర్వాత సందీప్ వంగాకు అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా మూవీ ఉంటుంది.
This post was last modified on November 29, 2023 11:55 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి…
ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేసిన లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే.…
70 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ముఖ్యంగా ఇటీవల మన శంకర…
తన పాటల కాపీ రైట్స్ విషయంలో నిర్మాతల దగ్గర ముక్కుపిండి మరీ కోర్టుల ద్వారా రాయల్టీ పొందుతున్న ఇళయరాజాకు ఢిల్లీ…
ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేయడం తనకు కొత్తకాదని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తనకు…
పరిశ్రమలో జరిగే కొన్ని సంఘటనలు విచిత్రంగా ఉంటాయి. అలాంటిదే ఇది కూడా. ఇటీవలే విడుదలైన సీత పయనంకు ఆశించిన స్పందన…