మాములుగా ఒక పెద్ద సినిమా ఏదైనా ప్రకటించాక లేక షూటింగ్ మొదలుపెట్టాక ఏడాది లేదా రెండేళ్లలోపు పూర్తి చేస్తేనే దాని మీద ఆడియన్స్ అంచనాలను క్రమం తప్పకుండ పెంచుతూ పోవచ్చు. అలా కాకుండా కారణాలు ఏమైనా నెలలు, సంవత్సరాలు ఆలస్యం చేస్తూ పోతే ఫ్యాన్స్ లోనే హైప్ తగ్గే ప్రమాదం ఉంటుంది. సరిగ్గా పోయినేడు నవంబర్ 28న రామ్ చరణ్ 16 అధికారిక ప్రకటన వచ్చింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియా మూవీ ఉంటుందని హీరోతో సహా టీమ్ మొత్తం అనౌన్స్ చేసింది. తర్వాత ఎలాంటి కదలిక లేకుండా పోయింది.
గేమ్ చేంజర్ ఎదురు చూసే కొద్దీ జాప్యం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. దర్శకుడు శంకర్ దీంతో సమాంతరంగా భారతీయుడు 2 తీయడానికి కమిటైపోవడం వల్ల బుచ్చిబాబు ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే తప్ప చరణ్ మాములు గెటప్ లోకి రాలేడు. పైగా ఆర్సి 16 కోసం ప్రత్యేకంగా మేకోవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ శంకర్ ఇదొక్కటే తీస్తూ ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిర్మాత దిల్ రాజు నిలబెట్టేవారు. కానీ సాధ్యపడలేదు. అసలు 2024లో అయినా విడుదల ఉంటుందా లేదానేది అనుమానంగానే ఉంది.
ఇకపై రామ్ చరణ్ స్పీడ్ పెంచాల్సి ఉంది. తనకన్నా కొత్త సినిమా మొదలుపెట్టడంలో ఆలస్యం చేసిన ఆర్ఆర్ఆర్ మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ దేవరని ఏప్రిల్ 5 విడుదలకు ఫిక్స్ చేసేశాడు. వార్ 2 కోసం డిసెంబర్ నుంచి హృతిక్ రోషన్ తో కలుస్తున్నాడు. వేసవి నుంచి ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీకి మైత్రి మూవీ మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారు. తర్వాత దేవర 2 కొనసాగింపు కంటిన్యూ అవుతుంది. ఇదంతా పక్కా ప్లానింగ్ తో జరుగుతుంది. కానీ రామ్ చరణ్ శంకర్ ది కాకుండా లాక్ చేసుకుంది బుచ్చుబాబుది ఒక్కటే. కనీసం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెబితే ఫ్యాన్స్ ఊరట చెందుతారు.
This post was last modified on November 28, 2023 3:18 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…