‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా లెవెల్లో ఆ స్థాయి విజయం సాధించిన సినిమా అంటే ‘కేజీఎఫ్’యే. సౌత్ ఇండియాలో క్వాలిటీ పరంగా మిగతా వాటి కంటే దిగువన ఉండే కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా వస్తుందని.. ఇలా ఇతర భాషల వాళ్లను ఉర్రూతలూగించి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.
ఐతే ఈ సినిమాకు విడుదలకు ముందే బజ్ రావడానికి.. తెలుగు, హిందీ భాషల్లో బిజినెస్ కావడానికి మన దర్శక ధీరుడు రాజమౌళి సాయం చేశాడట. ఇది ఆశ్చర్యంగా అనిపించొచ్చు కానీ.. నిజం. ఈ విషయాన్ని ‘కేజీఎఫ్’ హీరో యశ్యే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘కేజీఎఫ్’లో రాకీ పాత్ర తెగ నచ్చేసి ఆ పాత్ర కోసం ఎంతో కష్టపడి తయారయ్యానని.. ముందుగా కొన్ని సీన్లు తీశామని.. అవి చూశాక కాన్ఫిడెన్స్ వచ్చిందని.. అలాంటి సందర్భంలో రాజమౌళిని కలవడం సినిమాకు చాలా మేలు చేసిందని యశ్ వెల్లడించాడు.
తమ సినిమా మేకింగ్ చర్చల్లో భాగంగా బెంగళూరులోని ఓ హోటల్లో ఉండగా.. అక్కడికి అనుకోకుండా రాజమౌళి వచ్చారని.. దీంతో ఆయనకు తమ సినిమాలోని కొన్ని విజువల్స్ చూపించామని.. అవి ఆయనకు బాగా నచ్చాయని.. తమను అభినందించి ప్రోత్సహించారని.. దీంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపైందని యశ్ వెల్లడించాడు. అంతటితో ఆగకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు తమ సినిమా గురించి చెప్పి బిజినెస్ జరగడానికి సాయం చేశారని యశ్ తెలిపాడు.
తెలుగులో రాజమౌళి మిత్రుడే అయిన సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆ చిత్రం అనూహ్యమైన వసూళ్లు సాధించింది. ఇక రాజమౌళి జడ్జిమెంట్ను నమ్మి హిందీ డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా మీద పెట్టుబడి పెట్టి మంచి ఫలితాన్నందుకున్నారు. ఈ రకంగా ‘కేజీఎఫ్’ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించడంలో మన రాజమౌళి పాత్ర కూడా ఉందన్నమాట.
This post was last modified on August 31, 2020 9:47 am
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…