ఇంకో మూడు రోజుల్లోనే ‘యానిమల్’ సినిమా థియేటర్లలోకి దిగబోతోంది. ఆ సినిమా రన్ టైం గురించి ప్రస్తుతం పెద్ద చర్చే జరుగుతోంది. ఏకంగా 3 గంటల 21 నిమిషాల ఫైనల్ కట్తో సినిమాను థియేటర్లలోకి వదిలేస్తున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. మూడు గంటల సినిమాకే అమ్మో అనుకునే రోజులు ఇవి. అలాంటిది ఇంకో 21 నిమిషాలు అదనపు నిడివితో సినిమా ఉంటే ప్రేక్షకులు తట్టుకోగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సినిమాలో విషయం ఉంటే.. నిడివి అనేది పెద్ద సమస్యే కాదని సందీప్ అండ్ కో అంటోంది.
నిజానికి ‘యానిమల్’ ఒరిజినల్ రన్ టైం ఇంకా ఎక్కువట. 3 గంటల 50 నిమిషాల నిడివితో ఫస్ట్ కాపీ రెడీ చేశాడట సందీప్. ఈ విషయాన్ని స్వయంగా హీరో రణబీర్ కపూర్ ప్రెస్ మీట్లో చెప్పడం విశేషం.
ఐతే థియేటర్లలో మరీ అంత నిడివితో రిలీజ్ చేస్తే అంతే సంగతులు. రెండు ఇంటర్వెల్స్ ఇచ్చుకోవాలి. సినిమా ఎంత బాగున్నా కూడా అంత సేపు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం సవాలే. దీనికి తోడు థియేటర్ల యాజమాన్యాలు రోజుకు నాలుగు షోలు నడపడం కూడా కష్టమై గగ్గోలు పెడతాయి. అందుకే అతి కష్టం మీద సినిమా నిడివిని ఇంకో 29 నిమిషాలు తగ్గించాడట సందీప్ రెడ్డి.
ఐతే థియేటర్లలోకి 3.21 గంటల రన్ టైంతో వదిలినా.. ఓటీటీలో సినిమా రిలీజైనపుడు మాత్రం ఒరిజినల్ రన్ టైమే ఉంటుందట. ఓటీటీలో చూసే ప్రేక్షకుల్లో ఎవరి ఓపిక వాళ్లది. అందులోనూ థియేటర్లతో పోలిస్తే అదనపు సన్నివేశాలు ఉన్నాయంటే మరింత ఆసక్తితో చూస్తారు. కాబట్టి ఓటీటీ వెర్షన్లో డైరెక్టర్స్ కట్ చూడొచ్చన్నమాట. ‘యానిమల్’ థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…