Movie News

త్రివిక్రమ్ మౌనానికి అదే కారణం

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ కి నిర్మాత నాగవంశీనే అయినా ఆ సంస్థ తీసే సినిమాలకు సంబంధించిన కీలక విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రమేయం ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. కథతో మొదలుపెట్టి ప్రమోషన్ల దాకా అవసరమున్న చోట ఆయన దగ్గరుండి చూసుకుంటూ సలహాలు సూచనలు ఇస్తుంటారు. సర్, మ్యాడ్ లకు తన రచన, పర్యవేక్షణ లేకపోయినా సరే ఆయా దర్శకులతో కూర్చుని చర్చలు చేసి అవసరమైన మేర కరెక్షన్లు, ఇంప్రూవ్ మెంట్లు ఇచ్చారనేది తెలిసిన విషయమే. అయితే ఆదికేశవ ప్రాజెక్టులో మాత్రం త్రివిక్రమ్ ముందు నుంచీ ఆంటీ అంటనట్టే ఉన్నారు.

దీని గురించి ఒక ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఆదికేశవని వైష్ణవ్ తేజ్ తొలుత ఓకే చేసినప్పుడు సితార భాగస్వామ్యం లేదట. కొంత భాగం అయ్యాక ముందుకు కదలకపోవడంతో పవన్ సూచన మేరకు నాగవంశీ టేకప్ చేసినట్టు చెబుతున్నారు. కథ, స్క్రిప్ట్ విన్న త్రివిక్రమ్ అందులో లోటుపాట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గుంటూరు కారం పనుల ఒత్తిడి వల్ల ఎక్కువ ఫోకస్ పెట్టలేకపోవడంతో అలాగే ప్రొసీడ్ అయ్యారట. కొన్నిసార్లు ఎంత రొటీన్ మాస్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి కాబట్టి ఆ రకమైన నమ్మకంతో ముందుకెళ్ళిపోయి పూర్తి చేశారు.

తీరా చూస్తే ఫలితం తేడా కొట్టేసింది. ఆదికేశవకు మెగా హీరోలను, త్రివిక్రమ్ ను తీసుకొచ్చి ఓ ఈవెంట్ చేసే ఛాన్స్ ఉన్నా వాడుకోలేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలతో సరిపెట్టేశారు. ముందే ఏం జరుగుతుందో ఊహించడం వల్లేనని ఎవరైనా కామెంట్ చేస్తే కాదనలేని పరిస్థితి. అంతెందుకు కలర్స్ స్వాతి కోసం ట్రైలర్ లాంచ్ కు వచ్చిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడి ఆదికేశవకు ట్వీట్ తో సరిపెట్టేశాడు కానీ ఏదైనా కాంబో వీడియో లాంటిది చేయలేదు. చిరంజీవి సైతం రిలీజప్పుడు విష్ చేస్తూ ట్వీట్ కూడా వేయలేదు. అలాంటప్పుడు త్రివిక్రమ్ మౌనంగా ఉండిపోవడంలో కారణం, న్యాయం రెండూ ఉన్నాయి.

This post was last modified on November 26, 2023 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

15 minutes ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

46 minutes ago

డిల్లీ వేదికపై చైనా రోబో.. ఏంటి వివాదం?

ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్‌లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…

60 minutes ago

అంబటి… ఈ సారైనా రిలీజయ్యేనా?

సీఎం చంద్రబాబును దూషించిన కేసులో అరెస్టైన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.…

60 minutes ago

మృత్యుంజయ్ మనసు మారితే మంచిదే

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్…

1 hour ago

స్మార్టుగా తప్పించుకున్న మాస్ మహారాజా

ఏదో కామెడీతో ఆడేస్తుందనుకున్న ఫంకీ మొదటి వారంలోనే చేతులెత్తేయడం ఊహించని పరిణామం. పెద్దగా పోటీ లేని అవకాశాన్ని వాడుకోలేకపోవడం విశ్వక్…

2 hours ago