టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ స్టయిలే వేరు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతూ.. కొన్నిసార్లు వివాదాల్లో భాగమవుతూ సోషల్ మీడియాలో తరచుగా హాట్ టాపిక్ అవుతుంటాడు నాగవంశీ. ఆ మధ్య అవతార్-2 సినిమా మీద నాగవంశీ విమర్శలు చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇటీవల తన నిర్మాణంలో వచ్చిన మ్యాడ్ మూవీ.. జాతిరత్నాలుతో పోలిస్తే తక్కువ కామెడీ ఉందని, సరిగా నవ్వలేదని ఎవరైనా అంటే టికెట్ డబ్బులు వెనక్కిచ్చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది.
కట్ చేస్తే ఇప్పుడు కన్నడ హిట్ మూవీ సప్తసాగరాలు దాటి మీద నాగవంశీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఒక వెబ్ పోర్టల్ చర్చా వేదికలో కలర్స్ స్వాతి, శోభు యార్లగడ్డ, ప్రియదర్శి తదితరులతో కలిసి పాల్గొన్నాడు నాగవంశీ.
ఈ సందర్భంగా సప్తసాగరాలు దాటి-సైడ్ బి సినిమా చూశారా అని అడిగితే.. అలాంటి సినిమాలు చూసే ఛాన్సే లేదని తేల్చేశాడు నాగవంశీ. ఆల్రెడీ జీవితంలో ఉన్న డిప్రెషన్లు చాలని.. మళ్లీ సినిమా చూసి డిప్రెషన్లు తెచ్చుకోవాల్సిన పని లేదని అతనన్నాడు. డబ్బులిచ్చి మరీ థియేటర్లకు వెళ్లి ఏడవాల్సిన అవసరం లేదని నాగవంశీ అన్నాడు. ఇలాంటి సినిమాలు చూస్తే ఒక కొత్త కోణం తెలుస్తుంది కదా అని స్వాతి అనగా.. తాను మాత్రం సినిమా అంతా బాధే ఉన్న ఇలాంటి సినిమాలు చూడనంటే చూడనని తేల్చేశాడు.
ఇక ఈ చర్చలో భాగంగా బాగున్న సినిమాలు ఆడతాయి, బాలేనివి ఆడవన్నట్లుగా మిగతా వాళ్లు మాట్లాడగా.. తన సినిమా మంత్ ఆఫ్ మధు సరిగా ఆడలేదంటే అది బాలేదని అర్థమా అని స్వాతి ప్రశ్నించగా.. ఆ టైంలో ఐదు సినిమాలతో పోటీ ఉండటం ప్రభావం చూపి ఉండొచ్చని నాగవంశీ అన్నాడు.
This post was last modified on November 25, 2023 11:49 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…