టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ స్టయిలే వేరు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతూ.. కొన్నిసార్లు వివాదాల్లో భాగమవుతూ సోషల్ మీడియాలో తరచుగా హాట్ టాపిక్ అవుతుంటాడు నాగవంశీ. ఆ మధ్య అవతార్-2 సినిమా మీద నాగవంశీ విమర్శలు చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇటీవల తన నిర్మాణంలో వచ్చిన మ్యాడ్ మూవీ.. జాతిరత్నాలుతో పోలిస్తే తక్కువ కామెడీ ఉందని, సరిగా నవ్వలేదని ఎవరైనా అంటే టికెట్ డబ్బులు వెనక్కిచ్చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది.
కట్ చేస్తే ఇప్పుడు కన్నడ హిట్ మూవీ సప్తసాగరాలు దాటి మీద నాగవంశీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఒక వెబ్ పోర్టల్ చర్చా వేదికలో కలర్స్ స్వాతి, శోభు యార్లగడ్డ, ప్రియదర్శి తదితరులతో కలిసి పాల్గొన్నాడు నాగవంశీ.
ఈ సందర్భంగా సప్తసాగరాలు దాటి-సైడ్ బి సినిమా చూశారా అని అడిగితే.. అలాంటి సినిమాలు చూసే ఛాన్సే లేదని తేల్చేశాడు నాగవంశీ. ఆల్రెడీ జీవితంలో ఉన్న డిప్రెషన్లు చాలని.. మళ్లీ సినిమా చూసి డిప్రెషన్లు తెచ్చుకోవాల్సిన పని లేదని అతనన్నాడు. డబ్బులిచ్చి మరీ థియేటర్లకు వెళ్లి ఏడవాల్సిన అవసరం లేదని నాగవంశీ అన్నాడు. ఇలాంటి సినిమాలు చూస్తే ఒక కొత్త కోణం తెలుస్తుంది కదా అని స్వాతి అనగా.. తాను మాత్రం సినిమా అంతా బాధే ఉన్న ఇలాంటి సినిమాలు చూడనంటే చూడనని తేల్చేశాడు.
ఇక ఈ చర్చలో భాగంగా బాగున్న సినిమాలు ఆడతాయి, బాలేనివి ఆడవన్నట్లుగా మిగతా వాళ్లు మాట్లాడగా.. తన సినిమా మంత్ ఆఫ్ మధు సరిగా ఆడలేదంటే అది బాలేదని అర్థమా అని స్వాతి ప్రశ్నించగా.. ఆ టైంలో ఐదు సినిమాలతో పోటీ ఉండటం ప్రభావం చూపి ఉండొచ్చని నాగవంశీ అన్నాడు.
This post was last modified on November 25, 2023 11:49 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…