టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీ స్టయిలే వేరు. తనకు ఏమనిపిస్తే అది మాట్లాడుతూ.. కొన్నిసార్లు వివాదాల్లో భాగమవుతూ సోషల్ మీడియాలో తరచుగా హాట్ టాపిక్ అవుతుంటాడు నాగవంశీ. ఆ మధ్య అవతార్-2 సినిమా మీద నాగవంశీ విమర్శలు చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇటీవల తన నిర్మాణంలో వచ్చిన మ్యాడ్ మూవీ.. జాతిరత్నాలుతో పోలిస్తే తక్కువ కామెడీ ఉందని, సరిగా నవ్వలేదని ఎవరైనా అంటే టికెట్ డబ్బులు వెనక్కిచ్చేస్తానంటూ ఆయన చేసిన కామెంట్ కూడా వైరల్ అయింది.
కట్ చేస్తే ఇప్పుడు కన్నడ హిట్ మూవీ సప్తసాగరాలు దాటి మీద నాగవంశీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఒక వెబ్ పోర్టల్ చర్చా వేదికలో కలర్స్ స్వాతి, శోభు యార్లగడ్డ, ప్రియదర్శి తదితరులతో కలిసి పాల్గొన్నాడు నాగవంశీ.
ఈ సందర్భంగా సప్తసాగరాలు దాటి-సైడ్ బి సినిమా చూశారా అని అడిగితే.. అలాంటి సినిమాలు చూసే ఛాన్సే లేదని తేల్చేశాడు నాగవంశీ. ఆల్రెడీ జీవితంలో ఉన్న డిప్రెషన్లు చాలని.. మళ్లీ సినిమా చూసి డిప్రెషన్లు తెచ్చుకోవాల్సిన పని లేదని అతనన్నాడు. డబ్బులిచ్చి మరీ థియేటర్లకు వెళ్లి ఏడవాల్సిన అవసరం లేదని నాగవంశీ అన్నాడు. ఇలాంటి సినిమాలు చూస్తే ఒక కొత్త కోణం తెలుస్తుంది కదా అని స్వాతి అనగా.. తాను మాత్రం సినిమా అంతా బాధే ఉన్న ఇలాంటి సినిమాలు చూడనంటే చూడనని తేల్చేశాడు.
ఇక ఈ చర్చలో భాగంగా బాగున్న సినిమాలు ఆడతాయి, బాలేనివి ఆడవన్నట్లుగా మిగతా వాళ్లు మాట్లాడగా.. తన సినిమా మంత్ ఆఫ్ మధు సరిగా ఆడలేదంటే అది బాలేదని అర్థమా అని స్వాతి ప్రశ్నించగా.. ఆ టైంలో ఐదు సినిమాలతో పోటీ ఉండటం ప్రభావం చూపి ఉండొచ్చని నాగవంశీ అన్నాడు.
This post was last modified on November 25, 2023 11:49 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…