బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ ఇండియా ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నార్త్ ఇండియాలో సౌత్ హీరోల సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండగా.. బాలీవుడ్ హీరోలు తమ చిత్రాలకు సౌత్లో రీచ్ పెంచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలను దక్షిణాదిన బాగా ప్రమోట్ చేయడం ద్వారా మంచి వసూళ్లు తెచ్చుకోగలిగాడు. ఆల్రెడీ ‘బ్రహ్మాస్త్ర’తో దక్షిణాదిన మంచి ఫలితాన్నందుకున్న రణబీర్ కపూర్.. ఇప్పుడు ‘యానిమల్’తో ఇక్కడి ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ‘యానిమల్’ ప్రోమోలు సినిమాకు తెలుగు సహా దక్షిణాది భాషల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి. దీనికి ప్రమోషన్ల హడావుడి కూడా తోడైతే ఓపెనింగ్స్ మరింత ఎక్కువ ఉంటాయని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే రణబీర్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ రష్మికలతో కలిసి బాలయ్య షో ‘అన్స్టాపబుల్’కు వచ్చాడు.
ఈ షోను రణబీర్ భలే ఎంజాయ్ చేశాడని షో చూసిన వాళ్లెవ్వరికైనా అర్థమైపోతుంది. బాలయ్య అండ్ కో.. రణబీర్ను రిసీవ్ చేసుకున్న తీరు.. తన ఫ్యామిలీ లెగసీ గురించి షోలో ఇచ్చిన ప్రెజెంటేషన్.. అతడితో బాలయ్య సంభాషణ చూడముచ్చటగా అనిపించాయి. కపూర్ వంశీ ఘన చరిత్ర గురించి ఒక హృద్యమైన వీడియోతో రణబీర్ను కదిలించింది అన్స్టాపబుల్ టీం. ఇక బాలయ్య.. పృథ్వీరాజ్ కపూర్ సహా ఆ వంశపు హీరోల సినిమాల్లోని ఫేమస్ డైలాగులను పలుకుతూ రణబీర్ను టచ్ చేశాడు. ఇద్దరి మధ్య హిందీ సంభాషణ కూడా హుషారుగా సాగింది.
ఇక పెళ్లికి ముందు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని రణబీర్ అన్నపుడు బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్.. ఆలియాతో అనుబంధం గురించి మాట్లాడిన మాటలు సరదాగా అనిపించాయి. రణబీర్ సైతం ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..’’.. ‘‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. లాంటి బాలయ్య డైలాగులను చెప్పి ఆయన అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…