బాలీవుడ్ హీరోలు ఇప్పుడు సౌత్ ఇండియా ప్రమోషన్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నార్త్ ఇండియాలో సౌత్ హీరోల సినిమాల హవా అంతకంతకూ పెరుగుతుండగా.. బాలీవుడ్ హీరోలు తమ చిత్రాలకు సౌత్లో రీచ్ పెంచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. షారుఖ్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలను దక్షిణాదిన బాగా ప్రమోట్ చేయడం ద్వారా మంచి వసూళ్లు తెచ్చుకోగలిగాడు. ఆల్రెడీ ‘బ్రహ్మాస్త్ర’తో దక్షిణాదిన మంచి ఫలితాన్నందుకున్న రణబీర్ కపూర్.. ఇప్పుడు ‘యానిమల్’తో ఇక్కడి ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ‘యానిమల్’ ప్రోమోలు సినిమాకు తెలుగు సహా దక్షిణాది భాషల్లో మంచి హైప్ తీసుకొచ్చాయి. దీనికి ప్రమోషన్ల హడావుడి కూడా తోడైతే ఓపెనింగ్స్ మరింత ఎక్కువ ఉంటాయని టీం భావిస్తోంది. ఈ క్రమంలోనే రణబీర్.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, హీరోయిన్ రష్మికలతో కలిసి బాలయ్య షో ‘అన్స్టాపబుల్’కు వచ్చాడు.
ఈ షోను రణబీర్ భలే ఎంజాయ్ చేశాడని షో చూసిన వాళ్లెవ్వరికైనా అర్థమైపోతుంది. బాలయ్య అండ్ కో.. రణబీర్ను రిసీవ్ చేసుకున్న తీరు.. తన ఫ్యామిలీ లెగసీ గురించి షోలో ఇచ్చిన ప్రెజెంటేషన్.. అతడితో బాలయ్య సంభాషణ చూడముచ్చటగా అనిపించాయి. కపూర్ వంశీ ఘన చరిత్ర గురించి ఒక హృద్యమైన వీడియోతో రణబీర్ను కదిలించింది అన్స్టాపబుల్ టీం. ఇక బాలయ్య.. పృథ్వీరాజ్ కపూర్ సహా ఆ వంశపు హీరోల సినిమాల్లోని ఫేమస్ డైలాగులను పలుకుతూ రణబీర్ను టచ్ చేశాడు. ఇద్దరి మధ్య హిందీ సంభాషణ కూడా హుషారుగా సాగింది.
ఇక పెళ్లికి ముందు ఎవరితోనూ డేటింగ్ చేయలేదని రణబీర్ అన్నపుడు బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్.. ఆలియాతో అనుబంధం గురించి మాట్లాడిన మాటలు సరదాగా అనిపించాయి. రణబీర్ సైతం ‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు..’’.. ‘‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’.. లాంటి బాలయ్య డైలాగులను చెప్పి ఆయన అభిమానులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ సూపర్ హిట్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on November 25, 2023 11:43 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…