Movie News

డబుల్ ఇస్మార్ట్.. టెన్షన్ తీరిపోయింది

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత దశాబ్ద కాలంలో తీసిన ఏకైక హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా ఆయన కూడా ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయింది. కానీ దీని తర్వాత పూరి నుంచి వచ్చిన ‘లైగర్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. దీంతో పూరి మళ్లీ పూర్వపు స్థితికే చేరాడు. ‘లైగర్’ నష్టాలను సెటిల్ చేయడంలో ఆయనకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి తప్పలేదు. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం కాకముందే ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ను ఆయన పట్టాలెక్కించాడు.

ఈ సినిమా నుంచి వచ్చే ఆదాయంతో ‘లైగర్’ నష్టాలను సెటిల్ చేసేలా ఆయన బయ్యర్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘డబుల్ ఇస్మార్ట్’ మీద అభిమానుల్లో, ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్‌యే ఉంది. విలన్‌గా సంజయ్ దత్ రాకతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగింది. కాకపోతే అభిమానులను ఒక విషయం మాత్రం టెన్షన్ పెడుతూ వచ్చింది.

‘ఇస్మార్ట్ శంకర్’కు అదిరిపోయే పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో మంచి క్రేజ్ తీసుకొచ్చిన మణిశర్మ ‘డబుల్ ఇస్మార్ట్’కు దూరంగా ఉండటం చాలామందికి రుచించలేదు. వేరే సంగీత దర్శకుడిని పెట్టుకుంటే న్యాయం చేయగలరా అన్న ప్రశ్న తలెత్తింది. నిజానికి ‘ఇస్మార్ట్ శంకర్’ మొదలైనపుడు పెద్దగా హైప్ లేదు. దానికి బజ్ తెచ్చింది మణిశర్మ పాటలే. అవి ఒక ఊపు ఊపేయడంతో రిలీజ్ టైంకి మాంచి హైప్ వచ్చింది. అది దృష్టిలో ఉంచుకునే ‘డబుల్ ఇస్మార్ట్’కు మణిశర్మను దూరం పెట్టడం అభిమానులకు రుచించలేదు.

మణిశర్మను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలామంది పూరి, రామ్‌లకు విన్నపాలు చేశారు. ఆ ఫీడ్ బ్యాక్ చూశారా, మామూలుగానే అనిపించిందా అన్నది తెలియదు కానీ.. ఎట్టకేలకు మణిశర్మనే ఈ మూవీకి సంగతత దర్శకుడిగా తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ తీరిపోయింది. ‘ఇస్మార్ట్ శంకర్’కు ఇచ్చినట్లే మణి మాంచి పాటలు, ఆర్ఆర్ ఇచ్చాడంటే ఈ సినిమా సగం సక్సెస్ అయిపోయినట్లే.

This post was last modified on November 25, 2023 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

56 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

12 hours ago