డిసెంబర్ 7 విడుదల కాబోతున్న హాయ్ నాన్న కోసం న్యాచురల్ స్టార్ నాని ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తున్నాడు. డేట్ల సమస్య వల్ల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో భారం మొత్తం తన మీదే పడింది. వెరైటీ వీడియోలతో ఆకట్టుకుంటున్న తీరు సినిమాని ఆడియన్స్ కి ఇంకా దగ్గర చేస్తోంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఆపరేషన్ వాలెంటైన్ లు వాయిదా పడటం దాదాపు లాంఛనమే కావడంతో నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ ని ఒకటే కాచుకోవాల్సి ఉంటుంది. అయితే నానికో ఊహించని సవాల్ బాక్సాఫీస్ వద్ద ఎదురు కాబోతోంది.
సరిగ్గా వారం రోజుల ముందు డిసెంబర్ 1న రిలీజవుతున్న అనిమల్ మీద ఒక్కసారిగా హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ట్రైలర్ చూశాక యూత్ ఖచ్చితంగా చూడాలని ఫిక్సయిపోయారు. ఏ సర్టిఫికెట్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ జనాలకు కూడా నచ్చుతుందనే ధీమా మేకర్స్ లో కనిపిస్తోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అనిమల్ సునామి కనీసం రెండు వారాల పాటు ఉంటుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో, కేరళ లాంటి చోట్ల స్ట్రాంగ్ రన్ దక్కుతుంది. అక్కడ నానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. రెండు ఎమోషనల్ కథలే అయినప్పటికీ ట్రీట్ మెంట్ లో ఉన్న వ్యత్యాసం రీచ్ ని మారుస్తుంది.
సో అనిమల్ టాక్ ఎలా వస్తుందనేది హాయ్ నాన్నకు కీలకంగా మారుతుంది. కూతురు సెంటిమెంట్ తో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా పాటలు ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. ఇంతకీ కథ తాలూకు తీరు తెన్నులు ఇవాళ సాయంత్రం విడుదల కాబోయే ట్రైలర్ వచ్చాక క్లారిటీ వస్తుంది. దసరా లాంటి ఊర మాస్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన మూవీ కావడంతో కంటెంట్ పరంగా హాయ్ నాన్న మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ క్లాస్ ఆడియన్స్ తో పాటు కొంచెం మాస్ జనాలకు కనెక్ట్ అయితే చాలు హిట్టే.
This post was last modified on November 24, 2023 9:51 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…