మోస్ట్ అవైటెడ్ ‘యానిమల్’ ట్రైలర్ రానే వచ్చింది. టీజర్ చూశాక ట్రైలర్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా, ట్రైలర్ ఆ అంచనాలను కూడా మించిపోయింది. తండ్రీ కొడుకులు పాత్రలు మార్చుకునే తొలి సన్నివేశంతోనే షేకాడించేశాడు సందీప్ రెడ్డి. ఏదో ఒక హార్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది జనాలకు ట్రైలర్ చూస్తుంటే. ఇండియన్ మూవీస్లో ఇప్పటిదాకా ఎంతో వయొలెన్స్ చూశాం కానీ.. ఇందులో హింస ఇంకో స్థాయిలో ఉంటుందని ట్రైలర్ అడుగడుగునా హింట్ ఇస్తూనే సాగింది.
తెర మీద అందరూ రక్తపాతం చూపిస్తారు కానీ.. ఇందులో చూపించిన బ్లడ్ బాత్ స్టైల్ వేరు. ఒక రకమైన భయాన్ని కలిగించాయి కొన్ని షాట్లు. ట్రైలర్లో ఈ షాట్లు చూశాక ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు సందీప్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఆ వీడియోలో ‘కబీర్ సింగ్’కు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడాడు సందీప్. తన సినిమాను ఆయన విమర్శిస్తూ కేవలం 2 రేటింగ్ ఇచ్చారని.. ఐతే తన సినిమా రొండొందల కోట్ల వసూళ్లు రాబట్టిందని సందీప్ అన్నాడు. రేటింగ్ గురించి తనకు బాధేమీ లేదని.. కానీ తన కొత్త సినిమా రిలీజైనపుడు ఇదే క్రిటిక్స్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని అతను చెప్పాడు.
‘కబీర్ సింగ్’ను వయొలెంట్ ఫిలిం అని క్రిటిక్స్ అన్నారని.. కానీ అసలు వయొలెన్స్ అంటే ఏంటి అన్నది తన తర్వాతి సినిమాలో చూపించబోతున్నానని.. అప్పుడు వారి స్పందన చూడాలనుకుంటున్నానని సందీప్ చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ చూస్తుంటే ఇది కదా వయొలెన్స్ అంటే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వయొలెంట్ ఫిలిం చూపించబోతున్నట్లు ఆ రోజు చెప్పకనే చెప్పిన సందీప్.. ఈ రోజు ఆ మాటనే నిజం చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 23, 2023 8:27 pm
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…
కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన అనేక మందికి సర్కారు ఏర్పడిన తర్వాత.. నామినేటెడ్ పదవులతో సంతృప్తి కలిగిస్తున్నారు. ఎన్ని…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు వరుసగా కష్టాలు మొదలైపోతున్నాయి. మొన్నటి సార్వత్రిక…
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…