మోస్ట్ అవైటెడ్ ‘యానిమల్’ ట్రైలర్ రానే వచ్చింది. టీజర్ చూశాక ట్రైలర్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా, ట్రైలర్ ఆ అంచనాలను కూడా మించిపోయింది. తండ్రీ కొడుకులు పాత్రలు మార్చుకునే తొలి సన్నివేశంతోనే షేకాడించేశాడు సందీప్ రెడ్డి. ఏదో ఒక హార్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది జనాలకు ట్రైలర్ చూస్తుంటే. ఇండియన్ మూవీస్లో ఇప్పటిదాకా ఎంతో వయొలెన్స్ చూశాం కానీ.. ఇందులో హింస ఇంకో స్థాయిలో ఉంటుందని ట్రైలర్ అడుగడుగునా హింట్ ఇస్తూనే సాగింది.
తెర మీద అందరూ రక్తపాతం చూపిస్తారు కానీ.. ఇందులో చూపించిన బ్లడ్ బాత్ స్టైల్ వేరు. ఒక రకమైన భయాన్ని కలిగించాయి కొన్ని షాట్లు. ట్రైలర్లో ఈ షాట్లు చూశాక ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు సందీప్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఆ వీడియోలో ‘కబీర్ సింగ్’కు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడాడు సందీప్. తన సినిమాను ఆయన విమర్శిస్తూ కేవలం 2 రేటింగ్ ఇచ్చారని.. ఐతే తన సినిమా రొండొందల కోట్ల వసూళ్లు రాబట్టిందని సందీప్ అన్నాడు. రేటింగ్ గురించి తనకు బాధేమీ లేదని.. కానీ తన కొత్త సినిమా రిలీజైనపుడు ఇదే క్రిటిక్స్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని అతను చెప్పాడు.
‘కబీర్ సింగ్’ను వయొలెంట్ ఫిలిం అని క్రిటిక్స్ అన్నారని.. కానీ అసలు వయొలెన్స్ అంటే ఏంటి అన్నది తన తర్వాతి సినిమాలో చూపించబోతున్నానని.. అప్పుడు వారి స్పందన చూడాలనుకుంటున్నానని సందీప్ చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ చూస్తుంటే ఇది కదా వయొలెన్స్ అంటే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వయొలెంట్ ఫిలిం చూపించబోతున్నట్లు ఆ రోజు చెప్పకనే చెప్పిన సందీప్.. ఈ రోజు ఆ మాటనే నిజం చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 23, 2023 8:27 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…