మోస్ట్ అవైటెడ్ ‘యానిమల్’ ట్రైలర్ రానే వచ్చింది. టీజర్ చూశాక ట్రైలర్ మీద ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉండగా, ట్రైలర్ ఆ అంచనాలను కూడా మించిపోయింది. తండ్రీ కొడుకులు పాత్రలు మార్చుకునే తొలి సన్నివేశంతోనే షేకాడించేశాడు సందీప్ రెడ్డి. ఏదో ఒక హార్రర్ మూవీ చూస్తున్న ఫీలింగ్ కలిగింది జనాలకు ట్రైలర్ చూస్తుంటే. ఇండియన్ మూవీస్లో ఇప్పటిదాకా ఎంతో వయొలెన్స్ చూశాం కానీ.. ఇందులో హింస ఇంకో స్థాయిలో ఉంటుందని ట్రైలర్ అడుగడుగునా హింట్ ఇస్తూనే సాగింది.
తెర మీద అందరూ రక్తపాతం చూపిస్తారు కానీ.. ఇందులో చూపించిన బ్లడ్ బాత్ స్టైల్ వేరు. ఒక రకమైన భయాన్ని కలిగించాయి కొన్ని షాట్లు. ట్రైలర్లో ఈ షాట్లు చూశాక ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ రిలీజైనపుడు సందీప్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఆ వీడియోలో ‘కబీర్ సింగ్’కు ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్ ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడాడు సందీప్. తన సినిమాను ఆయన విమర్శిస్తూ కేవలం 2 రేటింగ్ ఇచ్చారని.. ఐతే తన సినిమా రొండొందల కోట్ల వసూళ్లు రాబట్టిందని సందీప్ అన్నాడు. రేటింగ్ గురించి తనకు బాధేమీ లేదని.. కానీ తన కొత్త సినిమా రిలీజైనపుడు ఇదే క్రిటిక్స్ ఎలా స్పందిస్తారో చూడాలని ఉందని అతను చెప్పాడు.
‘కబీర్ సింగ్’ను వయొలెంట్ ఫిలిం అని క్రిటిక్స్ అన్నారని.. కానీ అసలు వయొలెన్స్ అంటే ఏంటి అన్నది తన తర్వాతి సినిమాలో చూపించబోతున్నానని.. అప్పుడు వారి స్పందన చూడాలనుకుంటున్నానని సందీప్ చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు ‘యానిమల్’ చూస్తుంటే ఇది కదా వయొలెన్స్ అంటే అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ వయొలెంట్ ఫిలిం చూపించబోతున్నట్లు ఆ రోజు చెప్పకనే చెప్పిన సందీప్.. ఈ రోజు ఆ మాటనే నిజం చేశాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
This post was last modified on November 23, 2023 8:27 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…