ఇప్పుడు బ్రతికి లేడు కానీ ఒకప్పుడు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడలాడించిన గజదొంగ వీరప్పన్. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి మరీ గవర్నమెంట్ ముందు డిమాండ్లు పెట్టిన ఘనుడు. ఇతని గురించి ఎన్నెన్ని కథలు ప్రచారంలో ఉన్నాయో చెప్పడం కష్టం. వేలాది ఏనుగులను దంతాల కోసమే హతమార్చడం, వందల్లో పోలీసులను కిరాతకంగా చంపడం లాంటి ఎన్నో దుర్మార్గాలు ఇతని చరిత్ర పుస్తకంలో ఉన్నాయి. ఇన్ని చేసినా మంచివాడిగా కొలిచే వారు లేకపోలేదు. అడవి దగ్గరి గ్రామాల ప్రజలను బాగా చూసుకోవడం దానికో కారణంగా చెబుతారు.
సరే ఇదంతా గడిచిపోయినా గతమని మర్చిపోదామనుకున్నా దర్శక నిర్మాతలు వదిలిపెట్టడం లేదు. సినిమాలు వెబ్ సిరీస్ లు తీస్తూనే ఉన్నారు. త్వరలో జీ5లో ‘కూసే మునిస్వామి వీరప్పన్’ పేరుతో ఒక డాక్యు సిరీస్ రాబోతోంది. ఇవాళ ట్రైలర్ రిలీజ్ చేస్తే ప్రత్యేకంగా స్టార్ హీరో సూర్య దాన్ని షేర్ చేశాడు. దీనికన్నా ముందు కొన్నివారాల క్రితమే నెట్ ఫ్లిక్స్ లో ఇదే తరహాలో ‘ది హంట్ ఫర్ వీరప్పన్’ పేరుతో ఒక సిరీస్ ని స్ట్రీమింగ్ చేస్తే దానికి మంచి స్పందన వచ్చింది. గతంలో శివరాజ్ కుమార్ తో రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’ పేరుతో భారీ చిత్రాన్ని తీస్తే కన్నడలో మంచి వసూళ్లు రాబట్టింది.
కిషోర్-అర్జున్ సర్జ ప్రధాన పాత్రల్లో ‘అట్టహాస’ అనే మరో చిత్రం వీరప్పన్ మీదే వచ్చింది. ఇంకా వెనక్కు వెళ్తే నాజర్, దేవరాజ్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఈ గజదొంగ క్యారెక్టర్లలో మెరిసిన వారే. గర్వించదగే గొప్ప గాథ కాకపోయినా పదే పదే వీరప్పన్ గురించి చెప్పాలని తాపత్రయ పడటం విచిత్రంగా ఉంది. మణిరత్నం విలన్ లో విక్రమ్ పాత్రను డిజైన్ చేసింది ఈ స్ఫూర్తితోనే. ఫ్లాష్ బ్యాక్ లో చూపించే ప్రియమణి ఎపిసోడ్ నిజంగా జరిగిందేనని అప్పటి జర్నలిస్టులు చెబుతారు. చూస్తుంటే తిరిగి ఇన్నేళ్ల తర్వాత వీరప్పన్ మరోసారి అమ్ముకునే వస్తువుగా మారిపోయాడు. అంతే మరి బిజినెస్ అన్నాక ఎవరైనా వాడుకోవచ్చు.
This post was last modified on November 23, 2023 6:54 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…