టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బయట బాగా బిడియంతో కనిపించేది ఎవరంటే విక్టరీ వెంకటేష్ పేరు చెప్పేయొచ్చు. ఆయన పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం తక్కువ. పాల్గొన్నా కూడా పొడి పొడిగానే మాట్లాడతారు. చాలా వరకు కామ్గా కనిపిస్తారు.
అలాంటి వ్యక్తి ఒక కాలేజీకి వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేయడం.. అక్కడ విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేయడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. హిట్ ఫ్రాంఛైజీ ఫేమ్ శైలేష్ కొలను డైరెక్షన్లో వెంకీ నటించిన కొత్త చిత్రం సైంధవ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా నుంచి తాజాగా రాంగ్ యూసేజ్ అనే పాట రిలీజ్ అయింది. ఈ పాట మంచి హుషారుగా సాగేదే. గురు సినిమాలోని ఎంగిడి ఎంగిడి పాట స్టయిల్లో సాగే ఈ పాట ఇన్స్టంట్ హిట్టయింది.
కాగా ఈ పాట లాంచ్ ఒక ఇంజినీరింగ్ కాలేజీలో పెట్టారు. అక్కడ విద్యార్థులను చూడగానే వెంకీకి ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది. వాళ్లను చూసి ఆయన స్టేజ్ మీద చాలా హుషారుగా మాట్లాడారు. గెంతులేశారు. అంతే కాక పాట లాంచ్ సమయంలో వాసు సహా పలు వెంకీ సినిమాల్లోని పాటలకు విద్యార్థులు స్టెప్పులేస్తుంటే వెంకీ కూడా వాళ్లతో కలిసిపోయారు. సడెన్గా ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్లతో కలిసి మంచి హుషారుగా స్టెప్పులేశారు.
ఈ వయసులో వెంకీ చూపించిన ఎనర్జీ.. తన సినిమా ప్రమోషన్ కోసం ఆయన తపన పడుతున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. వెంకీ సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించిన సైంధవ్ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది. వచ్చే నెలలో సైంధవ్ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇంతకుముందు లాంచ్ చేసిన టీజర్ యాక్షన్ ప్యాక్డ్గా ఉండటంతో అభిమానులు సినిమాపై మంచి అంచనాలతో ఉన్నారు.
This post was last modified on November 22, 2023 10:06 am
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…