డిసెంబర్ 22 విడుదల కాబోతున్న సలార్ టికెట్ రేట్ల పెంపు కోసం హోంబాలే ఫిలిమ్స్ నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టేసుకున్నారు. కర్ణాటకలో ప్రైస్ క్యాపింగ్ లేదు కాబట్టి అక్కడ అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో మాత్రం అప్లై చేసుకోవాల్సిందే. హిందీలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర భాషల్లో కనీసం యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల వరకు గరిష్టంగా పెంపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే పర్మిషన్లు రావడానికి కొంత టైం పట్టేలా లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పథకాలు, మినహాయింపులు ఏ రంగానికి ఇవ్వకూడదు.
అధికార పార్టీ బిఆర్ఎస్ వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి అయినా సమస్య కాదు కానీ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. కానీ విశ్లేషణలు రూలింగ్ కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సో డిసెంబర్ మొదటి వారం అయ్యాకే క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిబంధనల కారణంగా పెద్ద హీరోల సినిమాలు సైతం చేయి దాటిపోయిన బడ్జెట్ ఉంటే తప్ప పెంపుని అడగటం లేదు. ప్రస్తుతం అక్కడ మల్టీప్లెక్సులకు 177, ఇతర స్క్రీన్లకు 145, సింగల్ థియేటర్లకు 110 ఉంది. సలార్ స్పెషల్ కేసు కాబట్టి పరిగణనలోకి తీసుకుంటారు.
అయితే వ్యవహారం అంత సులభంగా తేలదు. సినిమాలకు సంబంధించిన విషయాల్లో బాగా నాన్చడం అలవాటుగా పెట్టుకున్న వైసిపి ఇప్పుడు ప్రభాస్ కోసం త్వరగా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. తమిళనాడులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎందుకంటే అక్కడ బెనిఫిట్ షోలు లేవు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక టికెట్ రేట్ల వ్యవస్థ కట్టుదిట్టం అయిపోయి రేట్లు పెంచడానికి లేకుండా పోయింది. ఇప్పుడు సలార్ ని ప్రత్యేక దృష్టితో చూస్తారని చెప్పడానికి లేదు. పైగా తీసింది శాండల్ వుడ్ ప్రొడ్యూసర్లు. సో జిఓలు వచ్చేదాకా సలార్ నిర్మాతలకు టెన్షన్ తప్పదు మరి.
This post was last modified on November 21, 2023 9:02 pm
సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి…
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…