Movie News

సలార్ అనుమతులు ఎప్పుడిస్తారు

డిసెంబర్ 22 విడుదల కాబోతున్న సలార్ టికెట్ రేట్ల పెంపు కోసం హోంబాలే ఫిలిమ్స్ నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టేసుకున్నారు. కర్ణాటకలో ప్రైస్ క్యాపింగ్ లేదు కాబట్టి అక్కడ అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో మాత్రం అప్లై చేసుకోవాల్సిందే. హిందీలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర భాషల్లో కనీసం యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల వరకు గరిష్టంగా పెంపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.  అయితే పర్మిషన్లు రావడానికి కొంత టైం పట్టేలా లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పథకాలు, మినహాయింపులు ఏ రంగానికి ఇవ్వకూడదు.

అధికార పార్టీ బిఆర్ఎస్ వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి అయినా సమస్య కాదు కానీ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. కానీ విశ్లేషణలు రూలింగ్ కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సో డిసెంబర్ మొదటి వారం అయ్యాకే క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిబంధనల కారణంగా పెద్ద హీరోల సినిమాలు సైతం చేయి దాటిపోయిన బడ్జెట్ ఉంటే తప్ప పెంపుని అడగటం లేదు. ప్రస్తుతం అక్కడ మల్టీప్లెక్సులకు 177, ఇతర స్క్రీన్లకు 145, సింగల్ థియేటర్లకు 110 ఉంది. సలార్ స్పెషల్ కేసు కాబట్టి పరిగణనలోకి తీసుకుంటారు.

అయితే వ్యవహారం అంత సులభంగా తేలదు. సినిమాలకు సంబంధించిన విషయాల్లో బాగా నాన్చడం అలవాటుగా పెట్టుకున్న వైసిపి ఇప్పుడు ప్రభాస్ కోసం త్వరగా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. తమిళనాడులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎందుకంటే అక్కడ బెనిఫిట్ షోలు లేవు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక టికెట్ రేట్ల వ్యవస్థ కట్టుదిట్టం అయిపోయి రేట్లు పెంచడానికి లేకుండా పోయింది. ఇప్పుడు సలార్ ని ప్రత్యేక దృష్టితో చూస్తారని చెప్పడానికి లేదు. పైగా తీసింది శాండల్ వుడ్ ప్రొడ్యూసర్లు. సో జిఓలు వచ్చేదాకా సలార్ నిర్మాతలకు టెన్షన్ తప్పదు మరి.

This post was last modified on November 21, 2023 9:02 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

5 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

7 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

8 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

8 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

9 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago