డిసెంబర్ 22 విడుదల కాబోతున్న సలార్ టికెట్ రేట్ల పెంపు కోసం హోంబాలే ఫిలిమ్స్ నిర్మాతలు ప్రభుత్వాలకు విన్నపాలు పెట్టేసుకున్నారు. కర్ణాటకలో ప్రైస్ క్యాపింగ్ లేదు కాబట్టి అక్కడ అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో మాత్రం అప్లై చేసుకోవాల్సిందే. హిందీలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇతర భాషల్లో కనీసం యాభై నుంచి డెబ్భై అయిదు రూపాయల వరకు గరిష్టంగా పెంపు ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే పర్మిషన్లు రావడానికి కొంత టైం పట్టేలా లేదు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. పథకాలు, మినహాయింపులు ఏ రంగానికి ఇవ్వకూడదు.
అధికార పార్టీ బిఆర్ఎస్ వస్తే పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఒకవేళ కాంగ్రెస్ లేదా బిజెపి అయినా సమస్య కాదు కానీ ప్రాసెస్ ఆలస్యమయ్యే అవకాశముంటుంది. కానీ విశ్లేషణలు రూలింగ్ కి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. సో డిసెంబర్ మొదటి వారం అయ్యాకే క్లారిటీ వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిబంధనల కారణంగా పెద్ద హీరోల సినిమాలు సైతం చేయి దాటిపోయిన బడ్జెట్ ఉంటే తప్ప పెంపుని అడగటం లేదు. ప్రస్తుతం అక్కడ మల్టీప్లెక్సులకు 177, ఇతర స్క్రీన్లకు 145, సింగల్ థియేటర్లకు 110 ఉంది. సలార్ స్పెషల్ కేసు కాబట్టి పరిగణనలోకి తీసుకుంటారు.
అయితే వ్యవహారం అంత సులభంగా తేలదు. సినిమాలకు సంబంధించిన విషయాల్లో బాగా నాన్చడం అలవాటుగా పెట్టుకున్న వైసిపి ఇప్పుడు ప్రభాస్ కోసం త్వరగా నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. తమిళనాడులో మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎందుకంటే అక్కడ బెనిఫిట్ షోలు లేవు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక టికెట్ రేట్ల వ్యవస్థ కట్టుదిట్టం అయిపోయి రేట్లు పెంచడానికి లేకుండా పోయింది. ఇప్పుడు సలార్ ని ప్రత్యేక దృష్టితో చూస్తారని చెప్పడానికి లేదు. పైగా తీసింది శాండల్ వుడ్ ప్రొడ్యూసర్లు. సో జిఓలు వచ్చేదాకా సలార్ నిర్మాతలకు టెన్షన్ తప్పదు మరి.
This post was last modified on November 21, 2023 9:02 pm
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష(ప్రధాన కాదు) నాయకుడు, వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో అన్యాయంగా…