నిన్న ఆదికేశవ ట్రైలర్ వచ్చింది. ఆడియన్స్ లో దీని మీద పెద్దగా అంచనాలేం లేవు. పైగా ప్రమోషన్లు ఆలస్యంగా చేయడంతో పాటు హీరోయిన్ శ్రీలీల యాక్టివ్ గా పబ్లిసిటీలో లేకపోవడం మైనస్ అవుతోంది. డేట్లు లేకపోవడం లాంటి కారణాలేమైనా సరే భగవంత్ కేసరిలో ఇన్వాల్వ్ అయినంతగా ఇందులో ఆమె కావడం లేదన్నది వాస్తవం. ఇక వైష్ణవ్ తేజ్ మొదటిసారి ఊర మాస్ ని టచ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రెండు నిమిషాల వీడియోలో సగం లవ్ ట్రాక్ చూపించి రెండో సగం ఓ రేంజ్ ఎలివేషన్లతో నింపేశారు. మలయాళం బిజీ ఆర్టిస్టు జీజు జార్జ్ ని విలన్ గా తీసుకొచ్చి రవిశంకర్ గొంతులో భయపెట్టేశారు.
నిర్మాత నాగవంశీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత సరైన మాస్ సినిమా రాలేదన్న లోటుని ఆదికేశవ తీరుస్తుందని చెప్పారు కానీ రివ్యూలు రేటింగ్ అద్భుతంగా వస్తాయని అనుకోవడం లేదని కూడా అన్నారు. బాగానే ఉంది కానీ వైష్ణవ్ కి ఇదింకా నాలుగో సినిమా. సరైన ఫాలోయింగే ఏర్పడలేదు. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత రెండు డిజాస్టర్స్ పడ్డాయి. ఎంత మెగా ఫ్యామిలీ అయినా సరే ఆ కుటుంబం హీరోల ఫ్యాన్స్ అందరూ మొదటి రోజు వైష్ణవ్ తేజ్ కోసం రావడం లేదు. స్వంతంగా మార్కెట్ ఇంకా రాని లేత హీరో మీద ఇంత మాస్ ని ఏ ధైర్యంతో ట్రై చేశారనేది రేపు 24న తేలనుంది.
సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిన మాట వాస్తవమే కానీ వైష్ణవ్ ని ఇలాంటి ఎలివేటెడ్ క్యారెక్టర్ లో ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి బోయపాటి శీను, వివి వినాయక్ శైలి అనుసరించిన విషయం కూడా అర్థమైపోతోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయడానికి ట్రైలర్ ఇలా కట్ చేశారో లేక ఉన్నదే చూపించారో మొదటి ఆట అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే జివి ప్రకాష్ కుమార్ పాటలు పెద్దగా మేజిక్ చేయలేదు. అంత క్రేజీ కాంబో ఉన్న స్కందనే వర్క్ అవుట్ కానప్పుడు ఆదికేశవ ఏదైనా అద్భుతం చేస్తే మాత్రం మెగాహీరో సుడి తిరిగినట్టే.
This post was last modified on November 21, 2023 10:28 am
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…