నిన్న ఆదికేశవ ట్రైలర్ వచ్చింది. ఆడియన్స్ లో దీని మీద పెద్దగా అంచనాలేం లేవు. పైగా ప్రమోషన్లు ఆలస్యంగా చేయడంతో పాటు హీరోయిన్ శ్రీలీల యాక్టివ్ గా పబ్లిసిటీలో లేకపోవడం మైనస్ అవుతోంది. డేట్లు లేకపోవడం లాంటి కారణాలేమైనా సరే భగవంత్ కేసరిలో ఇన్వాల్వ్ అయినంతగా ఇందులో ఆమె కావడం లేదన్నది వాస్తవం. ఇక వైష్ణవ్ తేజ్ మొదటిసారి ఊర మాస్ ని టచ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రెండు నిమిషాల వీడియోలో సగం లవ్ ట్రాక్ చూపించి రెండో సగం ఓ రేంజ్ ఎలివేషన్లతో నింపేశారు. మలయాళం బిజీ ఆర్టిస్టు జీజు జార్జ్ ని విలన్ గా తీసుకొచ్చి రవిశంకర్ గొంతులో భయపెట్టేశారు.
నిర్మాత నాగవంశీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత సరైన మాస్ సినిమా రాలేదన్న లోటుని ఆదికేశవ తీరుస్తుందని చెప్పారు కానీ రివ్యూలు రేటింగ్ అద్భుతంగా వస్తాయని అనుకోవడం లేదని కూడా అన్నారు. బాగానే ఉంది కానీ వైష్ణవ్ కి ఇదింకా నాలుగో సినిమా. సరైన ఫాలోయింగే ఏర్పడలేదు. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత రెండు డిజాస్టర్స్ పడ్డాయి. ఎంత మెగా ఫ్యామిలీ అయినా సరే ఆ కుటుంబం హీరోల ఫ్యాన్స్ అందరూ మొదటి రోజు వైష్ణవ్ తేజ్ కోసం రావడం లేదు. స్వంతంగా మార్కెట్ ఇంకా రాని లేత హీరో మీద ఇంత మాస్ ని ఏ ధైర్యంతో ట్రై చేశారనేది రేపు 24న తేలనుంది.
సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిన మాట వాస్తవమే కానీ వైష్ణవ్ ని ఇలాంటి ఎలివేటెడ్ క్యారెక్టర్ లో ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి బోయపాటి శీను, వివి వినాయక్ శైలి అనుసరించిన విషయం కూడా అర్థమైపోతోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయడానికి ట్రైలర్ ఇలా కట్ చేశారో లేక ఉన్నదే చూపించారో మొదటి ఆట అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే జివి ప్రకాష్ కుమార్ పాటలు పెద్దగా మేజిక్ చేయలేదు. అంత క్రేజీ కాంబో ఉన్న స్కందనే వర్క్ అవుట్ కానప్పుడు ఆదికేశవ ఏదైనా అద్భుతం చేస్తే మాత్రం మెగాహీరో సుడి తిరిగినట్టే.
This post was last modified on November 21, 2023 10:28 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…