నిన్న ఆదికేశవ ట్రైలర్ వచ్చింది. ఆడియన్స్ లో దీని మీద పెద్దగా అంచనాలేం లేవు. పైగా ప్రమోషన్లు ఆలస్యంగా చేయడంతో పాటు హీరోయిన్ శ్రీలీల యాక్టివ్ గా పబ్లిసిటీలో లేకపోవడం మైనస్ అవుతోంది. డేట్లు లేకపోవడం లాంటి కారణాలేమైనా సరే భగవంత్ కేసరిలో ఇన్వాల్వ్ అయినంతగా ఇందులో ఆమె కావడం లేదన్నది వాస్తవం. ఇక వైష్ణవ్ తేజ్ మొదటిసారి ఊర మాస్ ని టచ్ చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారు. రెండు నిమిషాల వీడియోలో సగం లవ్ ట్రాక్ చూపించి రెండో సగం ఓ రేంజ్ ఎలివేషన్లతో నింపేశారు. మలయాళం బిజీ ఆర్టిస్టు జీజు జార్జ్ ని విలన్ గా తీసుకొచ్చి రవిశంకర్ గొంతులో భయపెట్టేశారు.
నిర్మాత నాగవంశీ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత సరైన మాస్ సినిమా రాలేదన్న లోటుని ఆదికేశవ తీరుస్తుందని చెప్పారు కానీ రివ్యూలు రేటింగ్ అద్భుతంగా వస్తాయని అనుకోవడం లేదని కూడా అన్నారు. బాగానే ఉంది కానీ వైష్ణవ్ కి ఇదింకా నాలుగో సినిమా. సరైన ఫాలోయింగే ఏర్పడలేదు. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత రెండు డిజాస్టర్స్ పడ్డాయి. ఎంత మెగా ఫ్యామిలీ అయినా సరే ఆ కుటుంబం హీరోల ఫ్యాన్స్ అందరూ మొదటి రోజు వైష్ణవ్ తేజ్ కోసం రావడం లేదు. స్వంతంగా మార్కెట్ ఇంకా రాని లేత హీరో మీద ఇంత మాస్ ని ఏ ధైర్యంతో ట్రై చేశారనేది రేపు 24న తేలనుంది.
సరైన మాస్ బొమ్మ వచ్చి నెలలు గడిచిన మాట వాస్తవమే కానీ వైష్ణవ్ ని ఇలాంటి ఎలివేటెడ్ క్యారెక్టర్ లో ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారనేది వేచి చూడాలి. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి బోయపాటి శీను, వివి వినాయక్ శైలి అనుసరించిన విషయం కూడా అర్థమైపోతోంది. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా డైవర్ట్ చేయడానికి ట్రైలర్ ఇలా కట్ చేశారో లేక ఉన్నదే చూపించారో మొదటి ఆట అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే జివి ప్రకాష్ కుమార్ పాటలు పెద్దగా మేజిక్ చేయలేదు. అంత క్రేజీ కాంబో ఉన్న స్కందనే వర్క్ అవుట్ కానప్పుడు ఆదికేశవ ఏదైనా అద్భుతం చేస్తే మాత్రం మెగాహీరో సుడి తిరిగినట్టే.
This post was last modified on November 21, 2023 10:28 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…