Movie News

రివ్యూల గొడవ.. మమ్ముట్టి రియాక్షన్

సినిమా వసూళ్లు, ఓవరాల్ రిజల్ట్‌ను సమీక్షలు కొంతమేర ప్రభావితం చేస్తాయడనంలో సందేహం లేదు. ఐతే సినిమా ఎలా ఉందన్నదాన్ని బట్టే రివ్యూలు ఉంటాయి తప్ప.. బాగున్న సినిమాను రివ్యూలు చంపేయలేవు. బాలేని సినిమాను బతికించనూ లేవు. కానీ తమ సినిమా మీద నెగెటివ్ రివ్యూలు ఇచ్చారని సమీక్షకుల మీద సినిమాల బృందాలు విరుచుకుపడే ట్రెండ్ ఈ మధ్య కనిపిస్తోంది.

తెలుగులో ఈ చర్చ చాలాసార్లు జరిగింది కానీ.. మలయాళంలో ఇప్పుడు అదే హాట్ టాపిక్‌గా మారింది. రివ్యూలకు వ్యతిరేకంగా సినిమాల బృందాలు కోర్టులకు వెళ్లడం, కేసులు పెట్టడం వరకు పంచాయితీ ముదిరిపోయింది. తమ సినిమా వసూళ్లు తగ్గడానికి సమీక్షలే కారణం అంటూ తమన్నా మలయాళంలో నటించిన ఓ సినిమాకు సంబంధించి దానికి చిత్ర బృందం కేసులు పెట్టడం సంచలనం రేపింది. అలాగే తమ సినిమాకు రివ్యూలు రాకుండా చూడాలని ముందే ఒక టీం కోర్టుకెక్కింది.

దీని మీద కేరళలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. ఐతే ఇటీవలే మమ్ముట్టి నటించిన ‘కన్నూర్ స్క్వాడ్’కు రివ్యూలు బాగా ప్లస్ అయ్యాయి. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద హిట్టయింది. ఇంతలో మమ్ముట్టి జ్యోతికతో కలిసి నటించిన మరో సినిమా ‘కాదల్ ద కోర్’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. దీని ప్రమోషన్లలో భాగంగా ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులు ‘రివ్యూ బాంబింగ్’ గురించి అడిగారు. దానికాయన పరిణతితో కూడిన సమాధానం ఇచ్చారు.

ఒక సినిమా ఫలితం పూర్తిగా రివ్యూల మీద ఆధారపడి ఉంటుందని తాను నమ్మనని మమ్ముట్టి అన్నారు. ప్రేక్షకులైనా, సమీక్షకులైనా తమ అభిప్రాయాన్ని చెప్పడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని.. ఇది అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవ్వరైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు కలిగి ఉంటారని ఆయనన్నారు. కాకపోతే వేరే ప్రభావాలకు లోను కాకుండా.. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పాలని.. నిర్మాణాత్మకంగా సినిమాను విశ్లేషించాలని ఆయన కోరారు. మమ్ముట్టి వ్యాఖ్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on November 21, 2023 9:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

5 hours ago