పెద్ద సినిమాలు థియేటర్ లో వచ్చినప్పుడు ఎంత సందడి చేస్తాయో ఓటిటి రిలీజ్ కావడం కోసం కూడా అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తారు. దసరాకు అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టగా తాజాగా లియోని ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంచుతున్నట్టు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇండియాకు ఆ డేట్ కాగా గ్లోబల్ గా 28 నుంచి విదేశాల ప్రేక్షకులు చూసుకోవచ్చు. జైలర్ ను దాటేస్తుందేమోనన్న రేంజ్ లో హడావిడి చేసిన లియో తమిళ వెర్షన్ నుంచే సింహభాగం వసూళ్లను నమోదు చేసుకుంది.
ఇక బ్యాలన్స్ ఉన్నది భగవంత్ కేసరి ఒక్కటే. బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అయిదో వారంలో అడుగు పెట్టాక కూడా ప్రధాన కేంద్రాల్లో ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. దీని తర్వాత వచ్చినవేవి పెద్దగా మెప్పించలేకపోవడంతో వీకెండ్ వసూళ్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ దాటేసి ఎప్పుడో లాభాలు వచ్చేయడంతో ఇదంతా బయ్యర్లు బోనస్ గానే ఫీలవుతున్నారు. కొన్ని చోట్ల స్కూల్ పిల్లలకు ప్రత్యేక షోలు వేయడం ద్వారా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సందేశాన్ని మరింత బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తన్నారు.
భగవంత్ కేసరి హక్కులు ప్రైమ్ తీసుకుంది. ఈ వారం పది రోజుల్లోనే డిజిటల్ ఎంట్రీ అవకాశముంది. నాలుగు వారాలు లేదా ఆరు వారాల మధ్య అధిక శాతం సినిమాలు ఓటిటి అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత కన్నా ఆలస్యం ఉండకపోవచ్చు. వరసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు నమోదు చేసుకున్న బాలయ్య ప్రస్తుతం బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. భగవంత్ కేసరి హిందీ డబ్బింగ్ తనే స్వయంగా చెబుతున్న సంగతి పంచుకున్న బాలకృష్ణ మరి ఆ అవకాశాన్ని డైరెక్ట్ గా ఓటిటిలో వినిపిస్తారో లేక ప్రత్యేకంగా నార్త్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on November 20, 2023 12:32 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…