నిన్నట్నుంచి కోలీవుడ్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ. సీనియర్ నటుడు, విలన్ పాత్రలకు పెట్టింది పేరైన మన్సూర్ అలీ ఖాన్.. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి. ‘లియో’ సినిమాలో త్రిష ఉందంటే.. తాను ఎంతో ఊహించుకున్నానని.. ఎన్నో సినిమాల్లో రేప్ సీన్లు చేశాం కాబట్టి, ఈ చిత్రంలో కూడా త్రిషతో రేప్ సీన్ ఉంటుంది కదా అని ఆశపడ్డానని.. కానీ తనకు ఆ అవకాశం దక్కలేదని అతను ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
ఇంతకుముందే ఒక వేడుకలో ఈ సినిమాలో త్రిషతో తనకు కాంబినేషన్ సీన్లు లేకపోవడంపై బాధ పడుతూ.. కనీసం మడోన్నా పాపతో అయినా సీన్లు పెట్టారు కదా అని సంతోషించానని.. కానీ ఆమెకు అన్న పాత్రను తనకిచ్చారని వాపోయాడు. ఆ వ్యాఖ్యలు పబ్లిక్ మీటింగ్లో, ‘లియో’ టీం అందరి ముందూ చేయడం గమనార్హం. ఐతే అప్పుడు అందరూ లైట్ తీసుకున్నారు కానీ.. తాజాగా అతను చేసిన ‘రేప్’ కామెంట్స్ మాత్రం తీవ్ర దుమారం రేపాయి.
త్రిష, ‘లియో’ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సహా పలువురు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖండనలు ఇచ్చారు. మహిళల మీద లైంగిక వేధింపులు, అభ్యంతరకర వ్యాఖ్యల విషయమై సోషల్ మీడియాలో ఎప్పట్నుంచో పోరాడుతున్న గాయని చిన్మయి సైతం ఈ టాపిక్ మీద వరుసగా ట్వీట్లు వేస్తోంది. ఆమె ఈ ఒక్క ఉదంతాన్నే కాక.. వేరే మేల్ సెలబ్రెటీలు వివిధ సందర్భాల్లో మహిళల మీద చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పోస్టులు పెడుతోంది.
‘కిక్’ శ్యామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తొలి చిత్ర కథానాయికలు జ్యోతిక, సిమ్రాన్లను ఉద్దేశించి గుర్రాలు అని వ్యాఖ్యానించాడు. దాన్ని ఆమె తప్పుబట్టింది. ఇంకా మరి కొన్ని వ్యాఖ్యలపై స్పందించింది. ఐతే అవకాశం దొరికింది కదా అని చిన్మయి దూరిపోతోందంటూ ఆమెతో నెటిజన్లు యుద్ధాలకు దిగుతున్నారు. అజిత్ ఓ సినిమాలో భాగంగా చెప్పిన డైలాగ్ను చూపించి ఇది తప్పుగా అనిపించలేదా అని ఒకరంటే.. విజయ్ ఒక వేడుకలో అనుష్కను ఉద్దేశించి చెప్పిన మాటలను మరొకరు ప్రస్తావించారు. అందుకు లాజిక్తో బదులిస్తోంది చిన్మయి. మొత్తానికి ఈ టాపిక్ సోషల్ మీడియాను ఊపేస్తుండగా.. నిన్నట్నుంచి నెటిజన్లతో చిన్మయి అలుపెరగకుండా పోరాటం చేస్తోంది.
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…