నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో వచ్చిన ఊపిరి సినిమాని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతారు. ఒక పెద్ద స్టార్ హీరో చక్రాల కుర్చీలో నటించడమనే పాయింట్ ని దర్శకుడు వంశీ పైడిపల్లి తీర్చిదిద్దిన తీరు ఆడియన్స్ ని మెప్పించింది. 2016లో వచ్చిన ఈ ఎమోషనల్ ఎంటర్ టైనర్ వల్లే నాగ్, కార్తీ బాండింగ్ బలపడింది. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ సర్దార్, జపాన్ హక్కులు కొని తెలుగులో రిలీజ్ చేయడానికి కారణం ఇదే. ఊపిరి ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్స్ కు రీమేకన్న సంగతి తెలిసిందే. కాకపోతే కేవలం థీమ్ ని మాత్రమే తీసుకుని నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు.
ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఊపిరిని హిందీలో తీయబోతున్నారు. ఒరిజినల్ వెర్షన్ ని కాకుండా తెలుగులో వాడిన ప్యాట్రన్ ని వాడబోతున్నట్టు తెలిసింది. నాగార్జున పాత్రలో అమితాబ్ బచ్చన్, కార్తీ క్యారెక్టర్ కు రాజ్ కుమార్ రావుని లాక్ చేసినట్టు తెలిసింది. కరణ్ జోహార్ నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఇది తెరకెక్కనుంది. అయితే దర్శకుడిగా ఆయన వ్యవహరిస్తారా లేక వేరొకరిని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అమితాబ్ బచ్చన్ కు ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి. పైగా వీల్ చైర్ లో ఉన్నా ఓ రేంజ్ లో చెలరేగిపోవడం పా లాంటి చిత్రాల్లో ఎప్పుడో చూశాం.
బాగానే ఉంది కానీ ఓటిటి కాలంలో రీమేకులు వీలైనంత ఆలస్యం చేయకుండా త్వరగా తీస్తే బెటర్. గ్లోబల్ కంటెంట్ ప్రేక్షకులకు మరీ దగ్గరగా వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ లేదా టీవీ ఉంటే చాలు ఏ భాషలో వచ్చినా సినిమా అయినా సరే క్షణాల్లో చూడగలుగుతున్నారు. అలాంటిది ఊపిరిని ఇప్పుడు తీయాలనుకోవడం సాహసమే. షూటింగ్ ఇంకా మొదలుకాలేదు. అసలే హిందీలో గత కొంత కాలంగా రీమేకులు చాలా దారుణమైన ఫలితాలు ఇస్తున్నాయి. దృశ్యం 2 లాంటి ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ ఫెయిల్యూర్సే. ఈ నేపథ్యంలో ఊపిరిని నార్త్ జనాలు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
This post was last modified on November 19, 2023 11:52 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…