ఆర్ఆర్ఆర్ తర్వాత ఆలస్యం చేయకుండా గేమ్ఛేంజర్ సినిమాను మొదలుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. దాని తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులైంది. ఆ తర్వాత చాన్నాళ్ల పాటు ఏ అప్డేట్ లేదు. చరణ్ 16వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుకి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తాడని చాన్నాళ్ల ముందే వార్తలు వచ్చాయి.
ఈ మధ్యే రెహమాన్ స్వయంగా ఆ విషయాన్ని ధ్రువీకరించాడు. ఇప్పుడు ఈ సినిమా కథానాయిక విషయంలో ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. జాన్వి కపూర్, కీర్తి సురేష్, రవీనా టాండన్ కూతురు రాషా టాండన్ ఇలా చాలా పేర్లు వినిపించాయి కానీ.. ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆ పేరే.. సాయిపల్లవి. ఎవ్వరి అంచనాలకూ అందని విధంగా చరణ్ సినిమాకు సాయిపల్లవిని కథానాయికగా కన్సిడర్ చేస్తున్నాడట దర్శకుడు బుచ్చిబాబు.
సాయిపల్లవి ఇప్పటిదాకా భారీ కమర్షియల్ సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరితోనూ నటించలేదు. ఆమె గొప్ప నటిగా పేరు తెచ్చుకున్నప్పటికీ పెద్ద స్టార్లు నటించే కమర్షియల్ సినిమాలకు సెట్ కాదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో చరణ్ సినిమాలో సాయిపల్లవి నటిస్తోందంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.
ఐతే మంచి కథాబలం ఉన్న కథలో కథానాయిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉండటంతో సాయిపల్లవిని కన్సిడర్ చేస్తున్నాడట బుచ్చిబాబు. ఆమెతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు. చరణ్ ఇందులో స్పోర్ట్స్ మన్ టర్న్డ్ కోచ్గా కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.
This post was last modified on November 17, 2023 9:04 am
తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు…
తెలివి ఎవరి సొత్తూ కాదు. ఐడియా ఉండాలేకానీ.. ఎంత కష్టమైన పనైనా సులువుగా మారిపోవడంతోపాటు సులువుగా మార్చుకోవడానికి కూడా అవకాశం…
భారత్, పాకిస్థాన్ మధ్య వైరం గత ఏడాది కాలంలో ఎంత తీవ్ర స్థాయికి చేరుకుందో తెలిసిందే. పరస్పరం ద్వేష భావం…
తమిళ దర్శకులకు మన తెలుగు మార్కెట్ సత్తా ఏంటో తెలుసు. అందుకే వీలైనంత టాలీవుడ్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడానికి…
దురంధర్ దెబ్బకు బాలీవుడ్ స్పై మూవీస్ కి తీరని కష్టం వచ్చి పడింది. దాంతో పోల్చుకుని తమ సినిమాలను జనం ఎక్కడ…
బీఆర్ఎస్ తో బీజేపీకి చీకటి పొత్తు ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. అయితే, బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని…