మెగాస్టార్ అభిమానుల దృష్టంతా ప్రస్తుతం ‘విశ్వంభర’ మీదే ఉంది. ‘భోళాశంకర్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న చిరు.. దాని తర్వాత చేయబోయే చిత్రమిదే. నిజానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నప్పటికీ.. దాన్ని పక్కన పెట్టి మరీ చిరు ఈ చిత్రంలోనే నటిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బేనర్లో దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది.
రెగ్యులర్ షూటింగ్ డిసెంబరులో మొదలవుతుందని అంటున్నారు. ఈ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహాలో ఉంటుందనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. దర్శకుడు వశిష్ఠ కూడా ‘విశ్వంభర’ జానర్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా ప్రస్తావన తెచ్చాడు. ప్రి ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనున్న నేపథ్యంలో వశిష్ఠ మరోసారి ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా ‘విశ్వంభర’లో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం గురించి చెప్పాడు. సినిమాలో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్తో ముడిపడ్డ సన్నివేశాలుంటాయని అతను తెలిపాడు. ‘‘నా రెండో సినిమాకే చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నా. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజైనపుడు నేను స్కూల్లో చదువుతున్నా.
ఆ సినిమా చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. మెగాస్టార్ అలాంటి స్వచ్ఛమైన ఫాంటసీ మూవీలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. మధ్యలో ‘అంజి’ సినిమా చేసినా.. అది పూర్తి స్థాయి ఫాంటసీ మూవీ కాదు. ‘విశ్వంభర’లో 70 శాతం విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాల, త్రిశూల శక్తి… లాంటి అంశాలకు ఆధ్యాత్మికతను జోడిస్తూ ఈ సినిమాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం’’ అంటూ మెగా అభిమానులను ఎగ్జైట్ చేసే మాటలు చెప్పాడు వశిష్ఠ.
This post was last modified on November 16, 2023 7:11 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…