అదేంటి నాగచైతన్య డెబ్యూ ఎప్పుడో 2009 జోష్ తో కదా జరిగింది. ఇప్పుడా హీరోయిన్ కి పెళ్లేంటని ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. సీనియర్ కథానాయిక, రెండో తరం టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్న రాధ కూతురు కార్తీక చైతుతోనే తెరకు పరిచయమైన సంగతి గుర్తేగా. ఇది ఆశించిన విజయం సాధించకపోయినా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కార్తీకలో గ్లామర్ ఫాక్టర్ తక్కువగా ఉండటంతో పాటు బక్కపలచని దేహం పెద్దగా అవకాశాలు రాకుండా చేసింది. అయినా జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో త్రిషతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం విదితమే.
అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలిలో చేసింది కానీ ఆడలేదు. ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం జీవాతో చేసిన రంగం. ఇన్నేళ్ల తర్వాత కార్తీకకు పెళ్లి కుదిరింది. రోహిత్ మీనన్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పెళ్లి కొడుకుకు సంబంధించిన ఎక్కువ వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు కానీ తర్వాత బయటికి వస్తాయి. అయితే ఇన్ని సంవత్సరాలు కార్తీక ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన వేడుక కోసమే రాధ ఇండియాలోనే ఉంటూ పనులు చూసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా.
హీరోలకు లేట్ మ్యారేజ్ కావడం మాములే కానీ ఇలా హీరోయిన్ కూడా ముప్పై నలభై వయసు చేరాకో లేదా దాటాకో చేసుకోవడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు కెరీర్ ని పూర్తిగా ఆస్వాదించాకే గృహణి బాధ్యతలు తీసుకోగా మంచి డిమాండ్ ఉన్నప్పుడే కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటివాడిగా చేసుకుంది. అయినా ఎవరి నిర్ణయాలు వారివే కానీ సెలబ్రిటీ పెళ్లిల్లంటే సహజంగానే జనంలో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. మంచి పాత్రలు వస్తే త్వరలో రీ ఎంట్రీ ఇస్తానంటున్న కార్తీక భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతుందేమో.
ప్రేక్షకులను దేవుళ్లుగా అభివర్ణిస్తారు. అభిమానులు లేకపోతే తాము లేమంటారు. కానీ ఆ ప్రేక్షకులు, అభిమానుల కోసం సినీ జనాలు ఏం…
మెగా స్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సినిమా గుర్తుంది కదా. చదువుకునే వయసు ముగిశాక శంకర్ దాదా వైద్య…
జాతీయ అవార్డుల మీద క్రమంగా అసంతృప్తి శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయేలా ఉంది. ఇండియన్ ఆస్కార్ గా చెప్పుకునే…
వచ్చే వారం విడుదల కాబోతున్న రామాయణ ట్రైలర్ నిన్న ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మీడియా ప్రతినిధులకు…
సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్... ఈ పేరు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. కుర్రకారు అయితే దీని గురించి మరింత…
ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ హరిత విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టినట్టు సీఎం…