అదేంటి నాగచైతన్య డెబ్యూ ఎప్పుడో 2009 జోష్ తో కదా జరిగింది. ఇప్పుడా హీరోయిన్ కి పెళ్లేంటని ఆశ్చర్యం కలిగినా ఇది నిజం. సీనియర్ కథానాయిక, రెండో తరం టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ బ్లాక్ బస్టర్లు అందుకున్న రాధ కూతురు కార్తీక చైతుతోనే తెరకు పరిచయమైన సంగతి గుర్తేగా. ఇది ఆశించిన విజయం సాధించకపోయినా ఇద్దరికీ మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కార్తీకలో గ్లామర్ ఫాక్టర్ తక్కువగా ఉండటంతో పాటు బక్కపలచని దేహం పెద్దగా అవకాశాలు రాకుండా చేసింది. అయినా జూనియర్ ఎన్టీఆర్ దమ్ములో త్రిషతో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం విదితమే.
అల్లరి నరేష్ బ్రదర్ అఫ్ బొమ్మాలిలో చేసింది కానీ ఆడలేదు. ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం జీవాతో చేసిన రంగం. ఇన్నేళ్ల తర్వాత కార్తీకకు పెళ్లి కుదిరింది. రోహిత్ మీనన్ ని త్వరలో వివాహం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. పెళ్లి కొడుకుకు సంబంధించిన ఎక్కువ వివరాలు ఇంకా వెల్లడి చేయలేదు కానీ తర్వాత బయటికి వస్తాయి. అయితే ఇన్ని సంవత్సరాలు కార్తీక ఒంటరిగా ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తన వేడుక కోసమే రాధ ఇండియాలోనే ఉంటూ పనులు చూసుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు కూడా.
హీరోలకు లేట్ మ్యారేజ్ కావడం మాములే కానీ ఇలా హీరోయిన్ కూడా ముప్పై నలభై వయసు చేరాకో లేదా దాటాకో చేసుకోవడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్ళు కెరీర్ ని పూర్తిగా ఆస్వాదించాకే గృహణి బాధ్యతలు తీసుకోగా మంచి డిమాండ్ ఉన్నప్పుడే కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటివాడిగా చేసుకుంది. అయినా ఎవరి నిర్ణయాలు వారివే కానీ సెలబ్రిటీ పెళ్లిల్లంటే సహజంగానే జనంలో విపరీతమైన ఆసక్తి నెలకొంటుంది. మంచి పాత్రలు వస్తే త్వరలో రీ ఎంట్రీ ఇస్తానంటున్న కార్తీక భవిష్యత్తులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారుతుందేమో.
This post was last modified on November 16, 2023 4:23 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…