Movie News

సంక్రాంతి పండక్కు క్రిస్మస్ ఎందుకయ్యా

అసలు సంక్రాంతి సినిమాల్లో ఏవి ఉంటాయో, ఏవి తప్పుకుంటాయో, అన్నింటికీ థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే కొత్త ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ ని జనవరి 12 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందాదున్ లాంటి కల్ట్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఇది రూపొందటంతో మంచి అంచనాలున్నాయి. హిందీ తమిళంతో పాటు ఒకేసారి తెలుగు వెర్షన్ ని సిద్ధం చేయబోతున్నారు.

నిజానికిది డిసెంబర్ 15 రావాలి. కానీ సలార్ వారం గ్యాప్ లోనే వస్తోందని తెలిసి డిసెంబర్ 8కి మార్చుకున్నారు. ఈలోగా ఏమైందో కానీ తిరిగి మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అసలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారో గుడ్డిగా అనౌన్స్ చేశారో అంతు చిక్కడం లేదు. విజయ్ సేతుపతికి సౌత్ మార్కెట్ కీలకం. కేవలం తనను చూసేందుకు ఉత్తరాది ఆడియన్స్ థియేటర్లు రారు. అలాంటప్పుడు ఎక్కువ నలిగిపోకుండా సోలోగా ప్లాన్ చేసుకోవాలి. అలా కాదని మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్, శివ కార్తికేయన్ తో పోటీ పడతానంటే అవసరం లేని రిస్క్ అవుతుంది.

ఈ నిర్ణయం పట్ల బయ్యర్ల సంగతేమో కానీ సేతుపతి అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మెర్రీ క్రిస్మస్ టీమ్ ఆలోచన ఇంకో కోణంలో కనిపిస్తోంది. ఎలాగూ రెండు మూడు తప్పుకుంటాయి కాబట్టి ఆ ఛాన్స్ వాడుకునేందుకు ముందే డేట్ ని రిజర్వ్ చేసి పెట్టుకునే ప్లాన్ కావొచ్చు. అసలు స్ట్రెయిట్ సినిమాలకే స్క్రీన్లు సరిపోవని మొత్తుకుంటూ ఉంటే ఇలా డబ్బింగ్ మేళాన్ని తీసుకొచ్చి రుద్దితే మాత్రం తెలుగు నిర్మాతలు గళమెత్తాల్సి ఉంటుంది. ఇలా అనువాదాల మీద జాలి చూపిస్తే మల్టీప్లెక్సులు వాటికి ప్రాధాన్యం ఇచ్చి మన షోలకు ఎసరు పెట్టే ప్రమాదం పొంచి ఉంది. 

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

4 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

33 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

59 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago