అసలు సంక్రాంతి సినిమాల్లో ఏవి ఉంటాయో, ఏవి తప్పుకుంటాయో, అన్నింటికీ థియేటర్లు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక డిస్ట్రిబ్యూటర్లు బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటే కొత్త ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా విజయ్ సేతుపతి – కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ ని జనవరి 12 విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అందాదున్ లాంటి కల్ట్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఇది రూపొందటంతో మంచి అంచనాలున్నాయి. హిందీ తమిళంతో పాటు ఒకేసారి తెలుగు వెర్షన్ ని సిద్ధం చేయబోతున్నారు.
నిజానికిది డిసెంబర్ 15 రావాలి. కానీ సలార్ వారం గ్యాప్ లోనే వస్తోందని తెలిసి డిసెంబర్ 8కి మార్చుకున్నారు. ఈలోగా ఏమైందో కానీ తిరిగి మళ్ళీ వాయిదా వేసుకున్నారు. అసలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారో గుడ్డిగా అనౌన్స్ చేశారో అంతు చిక్కడం లేదు. విజయ్ సేతుపతికి సౌత్ మార్కెట్ కీలకం. కేవలం తనను చూసేందుకు ఉత్తరాది ఆడియన్స్ థియేటర్లు రారు. అలాంటప్పుడు ఎక్కువ నలిగిపోకుండా సోలోగా ప్లాన్ చేసుకోవాలి. అలా కాదని మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాగార్జున, రజనీకాంత్, శివ కార్తికేయన్ తో పోటీ పడతానంటే అవసరం లేని రిస్క్ అవుతుంది.
ఈ నిర్ణయం పట్ల బయ్యర్ల సంగతేమో కానీ సేతుపతి అభిమానులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే మెర్రీ క్రిస్మస్ టీమ్ ఆలోచన ఇంకో కోణంలో కనిపిస్తోంది. ఎలాగూ రెండు మూడు తప్పుకుంటాయి కాబట్టి ఆ ఛాన్స్ వాడుకునేందుకు ముందే డేట్ ని రిజర్వ్ చేసి పెట్టుకునే ప్లాన్ కావొచ్చు. అసలు స్ట్రెయిట్ సినిమాలకే స్క్రీన్లు సరిపోవని మొత్తుకుంటూ ఉంటే ఇలా డబ్బింగ్ మేళాన్ని తీసుకొచ్చి రుద్దితే మాత్రం తెలుగు నిర్మాతలు గళమెత్తాల్సి ఉంటుంది. ఇలా అనువాదాల మీద జాలి చూపిస్తే మల్టీప్లెక్సులు వాటికి ప్రాధాన్యం ఇచ్చి మన షోలకు ఎసరు పెట్టే ప్రమాదం పొంచి ఉంది.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…