‘జిల్’ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. రాధాకృష్ణ కుమార్ ప్రామిసింగ్ డైరెక్టర్లా కనిపించాడు. ఊర మాస్ సినిమాలు చేసే గోపీచంద్ను సూపర్ స్టైలిష్గా ప్రెజెంట్ చేస్తూ ‘జిల్’లో యాక్షన్ను పండించిన తీరు ఆకట్టుకుంది. ఈ సినిమాలో అతను చూపించిన ప్రతిభే ప్రభాస్తో ‘రాధేశ్యామ్’ లాంటి భారీ చిత్రాన్ని తీసే అవకాశం కల్పించింది. ఐతే ఈ అవకాశాన్ని అతను సరిగా ఉపయోగించుకోలేకపోయాడు.
అవసరం లేని భారీ హంగులతో పరిమితికి మించి బడ్జెట్ పెట్టించడం ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ప్రభాస్ ఇమేజ్కు ఏమాత్రం తగని సినిమాతో తీవ్ర నిరాశకు గురి చేశాడు రాధాకృష్ణకుమార్. ఆల్రెడీ ‘సాహో’తో దెబ్బ తిన్న యువి అధినేతలు.. ‘రాధేశ్యామ్’ ధాటికి కుదేలయ్యారనే చెప్పాలి. దీన్నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది యువి సంస్థ.
ఐతే ‘రాధేశ్యామ్’తో తమ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టినప్పటికీ రాధాకృష్ణకు యువి అధినేతలు మరో అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. ‘రాధేశ్యామ్’ రిలీజయ్యాక ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయి రాధాకృష్ణ.. యువి అధినేతల పిలుపుతో ఓ కొత్త కథ మీద వర్క్ చేశాడట. దాదాపు స్క్రిప్టు పూర్తయినట్లు సమాచారం. ఈసారి భారీ చిత్రంతో చేతులు కాల్చుకోవడం ఎందుకని మిడ్ రేంజ్ మూవీతో వెళ్లబోతున్నారట.
‘జిల్’ స్థాయిలో ఒక మిడ్ రేంజ్ హీరోతో మీడియం బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. గోపీచంద్, శర్వానంద్ లాంటి హీరోలను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ‘రాధేశ్యామ్’లో పెద్దగా విషయం లేకుండా.. భారీ హంగులు జోడించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని చూడగా ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ఈసారి నేల మీదికి వచ్చిన రాధాకృష్ణ.. కంటెంట్ మీద దృష్టిపెట్టి మిడ్ రేంజ్ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
This post was last modified on November 15, 2023 10:34 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…