ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కినప్పుడు బయటికి రావడం మహా కష్టంగా ఉంటుంది. విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం అలాంటి చిక్కుల్లోనే ఆరేళ్ళ విలువైన కాలాన్ని గడిపేసింది. కేవలం దీని రిలీజ్ కోసమే నటుడిగా మారి డబ్బులు సంపాదిస్తున్నానని నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టకేలకు నవంబర్ 24న దీని మొదటి భాగం యుద్ధకాండం థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంతకీ దీన్ని గట్టెక్కించిన డీల్ కథేంటో ఓ లుక్ వేద్దాం.
ధృవ నక్షత్రం పూర్తిగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. శత్రువును పట్టుకోవడం కోసం ఒకరితో మరొకరికి సంబంధం లేని ఒక గ్యాంగ్ ఏర్పడటం ఇందులో మెయిన్ పాయింట్. అధిక శాతం షూటింగ్ విదేశాల్లో చేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ కాగా జైలర్ కన్నా ముందే దీంట్లో ఛాన్స్ కొట్టేశాడు విలన్ వినాయకన్. హరీష్ జైరాజ్ సంగీతం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇంత క్వాలిటీ టీమ్ ఉంది కాబట్టి వెండితెరపై ఎలా ఆడినా ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో నెట్ ఫ్లిక్స్ ధృవ నక్షత్రంని 40 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ టాక్.
ఇది చాలా భారీ మొత్తం. ప్యాన్ ఇండియా కాబట్టి థియేట్రికల్ గా వచ్చిన రెవిన్యూతో కలుపుకుని నిర్మాత ఈజీగా గట్టెక్కుతాడు. ఒకవేళ తేడా వస్తే రెండో భాగంతో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చేసి ఆమేరకు బయ్యర్లను ఒప్పించవచ్చు. ఈ రకంగా ధృవ నక్షత్రంకు రూట్ క్లియర్ అయ్యిందన్న మాట. విపరీతమైన జాప్యం జరగడంతో ఆడియన్స్ లో దీని మీద పెద్దగా ఆసక్తి రేగడం లేదు. అందుకే ప్రమోషన్లను వేగవంతం చేసే పనిలో ఉన్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ కానుంది. అదే రోజు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ తప్ప టాలీవుడ్ వైపు నుంచి పెద్దగా పోటీ లేదు.
This post was last modified on November 14, 2023 6:42 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…