ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కినప్పుడు బయటికి రావడం మహా కష్టంగా ఉంటుంది. విక్రమ్ నటించిన ధృవ నక్షత్రం అలాంటి చిక్కుల్లోనే ఆరేళ్ళ విలువైన కాలాన్ని గడిపేసింది. కేవలం దీని రిలీజ్ కోసమే నటుడిగా మారి డబ్బులు సంపాదిస్తున్నానని నిర్మాత కం దర్శకుడు గౌతమ్ మీనన్ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టకేలకు నవంబర్ 24న దీని మొదటి భాగం యుద్ధకాండం థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇటీవలే తెలుగు ట్రైలర్ లాంచ్ చేశారు. ఇంతకీ దీన్ని గట్టెక్కించిన డీల్ కథేంటో ఓ లుక్ వేద్దాం.
ధృవ నక్షత్రం పూర్తిగా ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్. శత్రువును పట్టుకోవడం కోసం ఒకరితో మరొకరికి సంబంధం లేని ఒక గ్యాంగ్ ఏర్పడటం ఇందులో మెయిన్ పాయింట్. అధిక శాతం షూటింగ్ విదేశాల్లో చేశారు. పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ కాగా జైలర్ కన్నా ముందే దీంట్లో ఛాన్స్ కొట్టేశాడు విలన్ వినాయకన్. హరీష్ జైరాజ్ సంగీతం గురించి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇంత క్వాలిటీ టీమ్ ఉంది కాబట్టి వెండితెరపై ఎలా ఆడినా ఓటిటిలో మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో నెట్ ఫ్లిక్స్ ధృవ నక్షత్రంని 40 కోట్లకు కొనుగోలు చేసినట్టు ఇండస్ట్రీ టాక్.
ఇది చాలా భారీ మొత్తం. ప్యాన్ ఇండియా కాబట్టి థియేట్రికల్ గా వచ్చిన రెవిన్యూతో కలుపుకుని నిర్మాత ఈజీగా గట్టెక్కుతాడు. ఒకవేళ తేడా వస్తే రెండో భాగంతో సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చేసి ఆమేరకు బయ్యర్లను ఒప్పించవచ్చు. ఈ రకంగా ధృవ నక్షత్రంకు రూట్ క్లియర్ అయ్యిందన్న మాట. విపరీతమైన జాప్యం జరగడంతో ఆడియన్స్ లో దీని మీద పెద్దగా ఆసక్తి రేగడం లేదు. అందుకే ప్రమోషన్లను వేగవంతం చేసే పనిలో ఉన్నారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ కానుంది. అదే రోజు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ తప్ప టాలీవుడ్ వైపు నుంచి పెద్దగా పోటీ లేదు.
This post was last modified on November 14, 2023 6:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…