దీపావళి సినిమాల సందడికి తెరపడింది. ఈ పండక్కి తెలుగు నుంచి ఒక్క సినిమా కూడా లేకపోవడం మన ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. పోనీ అనువాద చిత్రాలైనా మెప్పించాయా అంటే అదీ లేదు. జపాన్, జిగర్తండ డబుల్ఎక్స్, టైగర్-3.. మూడూ కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకున్నాయి. వీటికి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు. దీంతో ఇక ఫోకస్ అంతా తర్వాతి వారాంతంలో వచ్చే ‘మంగళవారం’ సినిమా మీదికి మళ్లింది.
‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రం.. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మధ్యలో ‘మహాసముద్రం’తో నిరాశపరిచిన అజయ్.. ఈ చిత్రంతో బలంగా బౌన్స్ బ్యాక్ అయ్యేలాగే కనిపిస్తున్నాడు. ఈ సినిమా మీద అజయ్ ఎంత ధీమాగా ఉన్నాడంటే.. దీన్నొక ఫ్రాంఛైజీగా మార్చి ఇదే వరుసలో సినిమాలు తీస్తానని అంటున్నాడు.
‘‘మంగళవారం సినిమాకు కొనసాగింపుగా కొన్ని సినిమాలు వస్తాయి. రాబోయే చిత్రం ప్రీక్వెలా, సీక్వెలా, ఇంకోటా అనేది చెప్పలేను. కానీ ‘మంగళవారం’ వరల్డ్ మాత్రం కొనసాగుతుంది. దీన్నొక ఫ్రాంఛైజీగా మారుస్తా’’ అని అజయ్ తెలిపాడు. తన తర్వాతి చిత్రం ఇదే అని అతను సంకేతాలు ఇచ్చాడు. ఇక ‘మంగళవారం’ టైటిల్ పెట్టడం గురించి మట్లాడుతూ.. ‘‘మంగళవారాన్ని కొందరు చెడ్డ రోజుగా చూస్తారు. కానీ అది శుభప్రదమైన రోజు. ముందు మనకు మంగళవారమే సెలవు రోజుగా ఉండేది. బ్రిటిషర్లు వచ్చి ఆదివారాన్ని సెలవుగా మార్చారు.
‘మంగళవారం’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగానే పెద్ద వంశీగారు ఫోన్ చేసి.. ‘మంచి టైటిల్ అ.జయ్. నేను చాలాసార్లు ఆ పేరు పెడదామంటే నిర్మాతలు ఒప్పుకోలేదు’ అన్నారు. ఆయన ఫోన్ చేసి టైటిల్ గురించి మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది’ అని అజయ్ తెలిపాడు. ‘మంగళవారం’ సినిమాలో చివరి 45 నిమిషాలు తీవ్ర ఉత్కంఠభరితంగా ఉంటుందని.. ట్విస్టుల మీద ట్విస్టులుంటాయని.. పాయ్ పాత్ర షాకింగ్గా ఉంటుందని, ఆమె పాత్రను చూసి ప్రేక్షకరులు బాధ పడుతూ థియేటర్ల నుంచి బయటికి వస్తారని అజయ్ అన్నాడు.
This post was last modified on November 14, 2023 1:30 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…