సడక్-2.. ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అయిన సినిమా. సోషల్ మీడియాలో ఆ సినిమా ప్రకంపనలు రేపింది. కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచింది. కానీ ఇవేవీ కూడా సానుకూల కారణాలతో జరిగినవి కావు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో.. బాలీవుడ్లో నెపోటిజం ప్రతినిధులుగా పేరున్న వాళ్లంతా కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు ప్రేక్షకులు.
దీని ట్రైలర్ లాంచ్ చేస్తే రికార్డు స్థాయిలో డిజ్ లైక్స్ కొట్టి ఒక వరస్ట్ రికార్డు చిత్ర బృందానికి కట్టబెట్టారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కానీ, పాటలు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమా డిజాస్టర్ కావడం ఖాయమని ముందే అందరూ తేల్చేశారు.
ఇంత నెగెటివిటీ మధ్య రిలీజైన సడక్-2 గురువారం అర్ధరాత్రి 12 గంటలకు హాట్ స్టార్+డిస్నీలో రిలీజైంది. ఆ సినిమా చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో హాహాకారాలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి.
90ల్లో సడక్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ భట్.. ఇన్నేళ్ల తర్వాత దర్శకత్వం చేస్తుంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశించిన వాళ్లందరూ సినిమా చూసి బెంబేలెత్తిపోయారు. గత కొన్నేళ్లలో బాలీవుడ్లో వచ్చిన వరస్ట్ మూవీస్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
మామూలుగా ఎలాంటి సినిమాకైనా ఓ మోస్తరు రేటింగ్ వేస్తాడని పేరున్న క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సింగిల్ స్టార్ ఇచ్చి అన్ బేరబుల్ అని మెసేజ్ పెట్టాడంటే ఈ సినిమా సంగతేంటో చెప్పేయొచ్చు.
మిగతా క్రిటిక్స్ దారుణమైన కామెంట్లు చేశారు. జీరో రేటింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా మీద ఉదయం నుంచి ఒకటే జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రలు పోషించారు.
This post was last modified on August 29, 2020 9:25 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…