సడక్-2.. ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అయిన సినిమా. సోషల్ మీడియాలో ఆ సినిమా ప్రకంపనలు రేపింది. కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచింది. కానీ ఇవేవీ కూడా సానుకూల కారణాలతో జరిగినవి కావు.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో.. బాలీవుడ్లో నెపోటిజం ప్రతినిధులుగా పేరున్న వాళ్లంతా కలిసి చేసిన సినిమా కావడంతో ఈ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు ప్రేక్షకులు.
దీని ట్రైలర్ లాంచ్ చేస్తే రికార్డు స్థాయిలో డిజ్ లైక్స్ కొట్టి ఒక వరస్ట్ రికార్డు చిత్ర బృందానికి కట్టబెట్టారు. ఇక ఈ సినిమా ట్రైలర్ కానీ, పాటలు కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమా డిజాస్టర్ కావడం ఖాయమని ముందే అందరూ తేల్చేశారు.
ఇంత నెగెటివిటీ మధ్య రిలీజైన సడక్-2 గురువారం అర్ధరాత్రి 12 గంటలకు హాట్ స్టార్+డిస్నీలో రిలీజైంది. ఆ సినిమా చూసిన వాళ్లందరూ సోషల్ మీడియాలో హాహాకారాలు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి నుంచి.
90ల్లో సడక్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మహేష్ భట్.. ఇన్నేళ్ల తర్వాత దర్శకత్వం చేస్తుంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశించిన వాళ్లందరూ సినిమా చూసి బెంబేలెత్తిపోయారు. గత కొన్నేళ్లలో బాలీవుడ్లో వచ్చిన వరస్ట్ మూవీస్లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు.
మామూలుగా ఎలాంటి సినిమాకైనా ఓ మోస్తరు రేటింగ్ వేస్తాడని పేరున్న క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సింగిల్ స్టార్ ఇచ్చి అన్ బేరబుల్ అని మెసేజ్ పెట్టాడంటే ఈ సినిమా సంగతేంటో చెప్పేయొచ్చు.
మిగతా క్రిటిక్స్ దారుణమైన కామెంట్లు చేశారు. జీరో రేటింగ్స్ ఇచ్చారు. ఈ సినిమా మీద ఉదయం నుంచి ఒకటే జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. ఇందులో సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, ఆలియాభట్ ప్రధాన పాత్రలు పోషించారు.
This post was last modified on August 29, 2020 9:25 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…