Movie News

తెలుగులో తేడా తమిళంలో భళా

ఒక భాషలో హిట్ అయిన సినిమా డబ్బింగ్ రూపంలో అదే ఫలితాన్ని తెచ్చుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ మధ్య ఇది మరింత స్పష్టంగా తేటతెల్లమవుతోంది. లారెన్స్ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ తమిళనాడులో 25 కోట్ల గ్రాస్ దాటేసి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కానీ ఏపీ తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ కలెక్షన్లు లేక ఎదురీదుతోంది. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం లేని కంటెంట్ కావడంతో తెలుగు జనాలు ఏమంత ఆసక్తి చూపించడం లేదు. దీంతో సమానంగా టాక్ తెచ్చుకున్న ‘జపాన్’ ఇదే దారి పట్టగా సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ మధ్యలో లాభపడటం కనిపిస్తోంది.

ఇదొక్కటే కాదు ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి. సెప్టెంబర్ లో వినాయక చవితికి వచ్చిన విశాల్ ‘మార్క్ ఆంటోనీ’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లు వసూలు చేసిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తీరా చూస్తే మన దగ్గర కనీస స్థాయిలో ఆడలేదు. ‘పొన్నియిన్ సెల్వన్’ని వాళ్ళు నెత్తినబెట్టుకుంటే మనకు మణిరత్నం టేకింగ్ అర్థం కాలేదు. విజయ్ సేతుపతి ‘విడుదల పార్ట్ 1’ ఫలితమూ ఇంతే. వెట్రిమారన్ టేకింగ్ లోని గొప్పదనాన్ని మనోళ్లు రిసీవ్ చేసుకోలేకపోయారు. రివ్యూలు, టాక్ బాగున్నప్పటికీ అది గ్రౌండ్ లెవల్ లో క్యాష్ కాలేదు. కన్నడ మూవీ ‘సప్తసాగరాలు దాటి సైడ్ ఏ’ కూడా ఇదే రిపీట్ అయ్యింది.

ఒకప్పుడు శంకర్, గౌతమ్ మీనన్, మణిరత్నం డబ్బింగ్ సినిమాలకు ఒకటే స్పందన వచ్చేది కానీ మారుతున్న పరిస్థితులు అభిరుచులకు అనుగుణుంగా ఇప్పుడు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పక్క రాష్ట్రంలో హిట్టు కొట్టిందని సంబర పడి హక్కులు కొనేసుకుంటే తర్వాత అయ్యో అనుకోవాల్సి పరిస్థితి తలెత్తుతోంది. కెజిఎఫ్, విక్రమ్, లియో లాంటివి మినహాయింపుగా చెప్పుకోవచ్చు కానీ ప్రతిసారి అలాంటి గ్రాండియర్లే రావుగా.  ప్రమోషన్లు, పబ్లిసిటీ హంగామా చేసినా మన నేటివిటీకి దగ్గరగా ఉంటేనే కొత్త తరం అంగీకరిస్తోంది. లేదంటే ఎంత పెద్ద బ్యానర్ ఉన్నా డిజాస్టర్లు తప్పవు. 

This post was last modified on November 13, 2023 7:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago