సినిమా రిలీజై మంచి విజయం సాధించిన ఆనందంలో నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు కార్లను బహుమతిగా ఇవ్వడం మామూలే. ఇటీవల ‘బేబి’ అనేే చిన్న సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్కు నిర్మాత ఎస్కేఎన్ ఖరీదైన కారు బహుకరించడం తెలిసిందే. ‘జైలర్’ సినిమా బ్లాక్బస్టర్ అయిన ఆనందంలో ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ అయితే హీరో, దర్శకుడే కాకుండా సంగీత దర్శకుడికి కూడా లగ్జరీ కార్లు బహుకరించాడు.
ఐతే రిలీజ్ తర్వాత ఇలా లగ్జరీ కార్లు ఇవ్వడం పాత ట్రెండు కాగా.. ఒక సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల కారును బహుమతిగా అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగ ఈ ఘనతను అందుకున్నట్లు సమాచారం. అతడి కొత్త సినిమా ‘యానిమల్’ వచ్చే నెల ఒకటో తారీఖున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆల్రెడీ సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’తో లాభాల పంట పండించుకున్నాడు నిర్మాత భూషణ్ కుమార్. ‘యానిమల్’ విడుదలకు ముందే దాన్ని మించి ఆయనకు లాభాలు అందించిందట. భారీ హైప్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మంచి టాక్ వస్తే ఓవర్ ఫ్లోస్తో మరింతగా భూషణ్కు లాభాలు రావడం ఖాయం. సందీప్ వల్లే భారీగా ఆదాయం అందుకున్న భూషణ్.. సినిమా మీద పూర్తి నమ్మకంతో ముందే అతడికి లగ్జరీ కారును బహుమతిగా అందించాడట.
ఆ కారు విలువ రూ.5 కోట్లు కావడం బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఇంత ఖరీదైన కారును బహుశా ఏ దర్శకుడూ గిఫ్ట్ కింది అందుకుని ఉండడు. అది కూడా విడుదలకు ముందే కావడం బాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం సందీప్ రెడ్డి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న ‘యానిమల్’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 10, 2023 9:24 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…