సినిమా రిలీజై మంచి విజయం సాధించిన ఆనందంలో నిర్మాతలు.. దర్శకులు, హీరోలకు కార్లను బహుమతిగా ఇవ్వడం మామూలే. ఇటీవల ‘బేబి’ అనేే చిన్న సినిమా సంచలన విజయం సాధించడంతో ఆ చిత్ర దర్శకుడు సాయి రాజేష్కు నిర్మాత ఎస్కేఎన్ ఖరీదైన కారు బహుకరించడం తెలిసిందే. ‘జైలర్’ సినిమా బ్లాక్బస్టర్ అయిన ఆనందంలో ఆ చిత్ర నిర్మాత కళానిధి మారన్ అయితే హీరో, దర్శకుడే కాకుండా సంగీత దర్శకుడికి కూడా లగ్జరీ కార్లు బహుకరించాడు.
ఐతే రిలీజ్ తర్వాత ఇలా లగ్జరీ కార్లు ఇవ్వడం పాత ట్రెండు కాగా.. ఒక సినిమా విడుదలకు ముందే ఐదు కోట్ల కారును బహుమతిగా అందుకోవడం సెన్సేషన్ అనే చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’తో సంచలనం రేపిన సందీప్ రెడ్డి వంగ ఈ ఘనతను అందుకున్నట్లు సమాచారం. అతడి కొత్త సినిమా ‘యానిమల్’ వచ్చే నెల ఒకటో తారీఖున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఆల్రెడీ సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’తో లాభాల పంట పండించుకున్నాడు నిర్మాత భూషణ్ కుమార్. ‘యానిమల్’ విడుదలకు ముందే దాన్ని మించి ఆయనకు లాభాలు అందించిందట. భారీ హైప్ మధ్య సినిమా రిలీజ్ కాబోతోంది. మంచి టాక్ వస్తే ఓవర్ ఫ్లోస్తో మరింతగా భూషణ్కు లాభాలు రావడం ఖాయం. సందీప్ వల్లే భారీగా ఆదాయం అందుకున్న భూషణ్.. సినిమా మీద పూర్తి నమ్మకంతో ముందే అతడికి లగ్జరీ కారును బహుమతిగా అందించాడట.
ఆ కారు విలువ రూ.5 కోట్లు కావడం బాలీవుడ్లో సంచలనం రేపుతోంది. ఇంత ఖరీదైన కారును బహుశా ఏ దర్శకుడూ గిఫ్ట్ కింది అందుకుని ఉండడు. అది కూడా విడుదలకు ముందే కావడం బాలీవుడ్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లు ఉంటే మాత్రం సందీప్ రెడ్డి రేంజే మారిపోతుందనడంలో సందేహం లేదు. డిసెంబరు 1న ‘యానిమల్’ బహు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 10, 2023 9:24 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…