ప్రభాస్ కెరీర్ లో డిజాస్టర్లు గతంలోనే చూశాడు కానీ ఆదిపురుష్ మీద వచ్చిన విమర్శలు మాత్రం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. దర్శకుడు ఓం రౌత్ రామాయణాన్ని తెరకెకెక్కించిన తీరు చాలా నెగటివిటీని తీసుకొచ్చింది. పాత్రధారుల మీద వచ్చిన కంప్లయింట్స్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకమే అవుతుంది. ఇంత ఫ్లాప్ అయినా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రావడంలో డార్లింగ్ బ్రాండ్ చాలా పని చేసింది. ఒకవేళ అంచనాలకు తగ్గట్టు కనక ఆదిపురుష్ వచ్చి ఉంటే దశాబ్దాల తరబడి ఒక ఐకానిక్ మూవీగా తరతరాలు చెప్పుకునేవాళ్ళు. ఛాన్స్ మిస్ అయ్యింది.
ఇంత జరిగినా ఆదిపురుష్ బుల్లితెరపై మాత్రం అదరగొట్టింది. గత నెలాఖరున వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేస్తే టిఆర్పి అర్బన్ 9.47 నమోదు చేయగా అర్బన్ ప్లస్ రూరల్ కలిపి 8.41 తెచ్చుకుంది. బాక్సాఫీస్ ఫలితంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్. ఎందుకంటే ఈ ఏడాది టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్యకు వచ్చింది కేవలం 5.14. దానికన్నా వీరసింహారెడ్డి ఎంతో మెరుగ్గా 8.83 సాధించింది. ఈ రెండూ ఘనవిజయం సాధించినవే. వీటికన్నా ఆదిపురుష్ ఎక్కువ రేటింగ్ సెట్ చేయడం నిజానికి అభిమానులు సైతం ఊహించలేదు.
దీన్ని బట్టి రాముడి సెంటిమెంట్, ప్రభాస్ ఇమేజ్ మన తెలుగు జనాల్లో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చి నెలలు దాటేసింది. వివిధ మార్గాల్లో ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది. అయినా కూడా ఇంత రేటింగ్ రావడం విశేషమే అది కూడా తెలుగు వెర్షన్ కు మాత్రమే. ఇది చూసి సంబరపడటం కాదు కానీ ఏదో కాసింత ఊరట కలిగేలా అభిమానులు సంతోష పడుతున్నారు. దీనికే ఇలా ఉంటే ఒకవేళ ప్రభాస్ కు సరైన సినిమా కనక పడితే టిఆర్పి టాప్ రాంక్ లో ఉన్న అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరులను దాటడం పెద్ద కష్టమేమీ కాదు.
రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్ను పూర్తిగా తన సొంతం…
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…