శంకర్-రామ్ చరణ్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ మీద మెగా అభిమానుల్లోనే కాక సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగకపోవడం, రిలీజ్ ఆలస్యం అవుతుండటం అభిమానులకు కొంత నిరాశ కలిగించినా.. దీని హైప్ మాత్రం తక్కువగా లేదు. ఈ సినిమాకు సంబంధించి అతి పెద్ద విశేషం ఏంటంటే.. ఇది శంకర్ సొంతంగా రాసిన కథ కాదు. అలా అని ఆయన తనతో పని చేసే రచయితల మీదా ఆధారపడలేదు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం.
శైలి పరంగా చూస్తే వీళ్లిద్దరూ భిన్నమైన సినిమాలు చేస్తుంటారు. వెరైటీ ఐడియాలతో కథలు అల్లే కార్తీక్ శంకర్ సినిమాకు కథ అందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి ఏ పరిస్థితుల్లో శంకర్ కోసం ‘గేమ్ చేంజర్’ కథ ఇచ్చాడనే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు కార్తీక్.
తన కొత్త చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కార్తీక్ ‘గేమ్ చేంజర్’ విశేషాలు పంచుకున్నాడు. తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా ఒక పొలిటికల్ కథ రాశానని.. అది ఒక షేప్ తీసుకున్నాక తన అసిస్టెంట్లకు చెబితే.. ఇది శంకర్ సినిమా లాగా పెద్ద స్థాయిలో కనిపిస్తోందిన అభిప్రాయపడ్డారని కార్తీక్ తెలిపాడు. తన కెరీర్లో ఇంకా అంత పెద్ద స్థాయి పొలిటికల్ మూవీ తీసే రేంజికి రాలేదని.. అందుకే ఈ కథను శంకర్కు ఇవ్వాలనిపించిందని.. ఆయన్ని సంప్రదించానని కార్తీక్ తెలిపాడు.
ఒక పెద్ద హీరోతో శంకరే ఈ సినిమా తీస్తే బాగుంటుందని అనిపించిందని.. ఆయన రామ్ చరణ్కు హీరోగా ఎంచుకున్నారని కార్తీక్ తెలిపాడు. కేవలం కథ మాత్రమే తను ఇచ్చానని.. దానికి స్క్రీన్ ప్లే అంతా శంకరే చేసుకున్నాడని.. తన కథ తెరపైకి ఎలా వస్తుందో చూడాలని తనకు కూడా చాలా క్యూరియాసిటీ ఉందని కార్తీక్ తెలిపాడు.
This post was last modified on November 8, 2023 10:47 pm
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…