పుష్ప 1 వచ్చి రెండేళ్లవుతున్నా దాని తాలూకు ప్రభావం నార్త్ ఆడియన్స్ లో బలంగా ఉంది. కేవలం ప్రేక్షకుల్లోనే కాదు సెలబ్రిటీలోనూ ఈ ఫీవర్ కనిపిస్తోంది. తాజాగా ఈ లిస్టులో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేరారు. ఇటీవలే జరిగిన కౌన్ బనేగా కరోడ్ పతి ఎపిసోడ్ లో పార్టిసిపెంట్ గా వచ్చిన ఓ గృహిణికి 20 వేల రూపాయల ప్రశ్న అడిగారు. 2023 సంవత్సరం జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్న హీరో ఎవరు అని ఆప్షన్లు ఇస్తే ఠక్కున ఆవిడ బన్నీ పేరు చెప్పేసి సొమ్ము గెలిచేసుకుంది. ఈ సందర్భంగానే అమితాబ్ పుష్ప గురించి కొన్ని గూస్ బంప్స్ మాటలు చెప్పారు.
పుష్ప చాలా గొప్ప సినిమా అని, కాలికి వేసుకున్న చెప్పు జారిపోతే దాన్ని కుంటుకుంటూ హీరో వేసుకోవడం ఒక స్టెప్పుగా మారడం జీవితంలో మొదటిసారి చూశానని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శ్రీవల్లి పాటలో ఒక కొండ మీద ఈ షాట్ వచ్చే సంగతి తెలిసిందే. అంత ప్రత్యేకంగా ఆ బిట్టునే గుర్తుపెట్టుకుని మరీ బిగ్ బి పంచుకోవడం చూస్తే ఆయన ఎంతగా అందులో లీనమై చూశారో అర్థమవుతుంది. బన్నీ అద్భుతంగా నటించాడనే కితాబుతో పాటు వచ్చిన ఫ్యాన్స్ తో టీమ్ కు చప్పట్ల రూపంలో అభినందనలు తెలియజేశారు. దాని తాలూకు వీడియో సోషల్ మీడియాలో గట్టిగానే తిరుగుతోంది.
దీన్ని బట్టే పుష్ప రీచ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ మీద ఆల్రెడీ ఓ రేంజ్ అంచనాలున్నాయి. మైత్రి నిర్మాతలు ఇంకా బిజినెస్ ని మొదలుపెట్టలేదు. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటిటి హక్కుల మీద కనివిని ఎరుగనంత రేంజ్ లో ధరలు పలుకుతాయనే ఉద్దేశంతో వేచి చూస్తున్నారు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఫిబ్రవరి తర్వాత ఒప్పందాల పర్వం మొదలు కాబోతోంది. ప్రస్తుతం భారీ ఎత్తున వందలాది జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో జాతర్ ఎపిసోడ్ ని షూట్ చేస్తున్న సుకుమార్ వేసవిలోగా గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
This post was last modified on November 8, 2023 8:19 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…