ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ ఒకేసారి రూపొందుతున్న సంగతి తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి రావడంతో రామ్ చరణ్ సంవత్సరాల తరబడి సమయాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే జరిగిందేదో జరిగింది బెస్ట్ వస్తే చాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది. ఇండియన్ 3 ఉందో లేదో అనే అనుమానాలకు చెక్ పెడుతూ కమల్ హాసన్ స్వయంగా తన పుట్టినరోజు వేడుకలో క్లారిటీ ఇచ్చేశారట. రెండు తర్వాత మూడో భాగం రిలీజయ్యాకే మిగిలిన సినిమాలు వస్తాయని కుండ బద్దలు కొట్టారు.
అసలు ట్విస్టు ఏంటంటే ఇండియన్ 2కి సంబంధించి మొత్తం 6 గంటల ఫుటేజ్ ని తీశారట. దీంట్లో ఒక అరగంట కత్తిరించినా మిగిలిన దాన్ని నీట్ గా ఎడిటింగ్ చేసుకుని రెండు భాగాలుగా రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంత భాగం షూటింగ్ చేసి ఫైనల్ కట్ కి సిద్ధం చేసుకోవాలి. నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ గతంలో ఈ విషయాన్ని చూచాయగా చెప్పినా నిర్ధారణగా చెప్పకపోవడంతో స్పష్టత రాలేదు. ఇప్పుడు కమల్ స్వయంగా క్లూస్ ఇవ్వడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సంగతేంటని మెగా ఫ్యాన్స్ అడిగితే సమాధానం ఎవరి దగ్గరా లేదు.
వచ్చే ఏడాది వేసవి లోగా శంకర్ కమల్, చరణ్ ఇద్దరివీ పూర్తి చేసి ఫ్రీ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. తర్వాత రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ చేయాల్సి ఉంది. దాన్నెప్పుడో అఫీషియల్ గా ప్రకటించారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా తీస్తారో లేదో తెలియదు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ విడుదల తేదీలు మాత్రం ఇప్పట్లో తేలే సూచనలు లేవు. చెన్నై వర్గాల ప్రకారం ఇండియన్ 2 ని వేసవిలో రిలీజ్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాచారం ఉందట. అధికారికంగా 2024 సంక్రాంతికి ఒక కొత్త టీజర్ తో ప్రకటించే అవకాశం ఉంది. ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on November 8, 2023 8:13 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…