ఇండియన్ స్పీల్బర్గ్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ ఒకేసారి రూపొందుతున్న సంగతి తెలిసిందే. తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి రావడంతో రామ్ చరణ్ సంవత్సరాల తరబడి సమయాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే జరిగిందేదో జరిగింది బెస్ట్ వస్తే చాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడో కొత్త ట్విస్టు వచ్చి పడింది. ఇండియన్ 3 ఉందో లేదో అనే అనుమానాలకు చెక్ పెడుతూ కమల్ హాసన్ స్వయంగా తన పుట్టినరోజు వేడుకలో క్లారిటీ ఇచ్చేశారట. రెండు తర్వాత మూడో భాగం రిలీజయ్యాకే మిగిలిన సినిమాలు వస్తాయని కుండ బద్దలు కొట్టారు.
అసలు ట్విస్టు ఏంటంటే ఇండియన్ 2కి సంబంధించి మొత్తం 6 గంటల ఫుటేజ్ ని తీశారట. దీంట్లో ఒక అరగంట కత్తిరించినా మిగిలిన దాన్ని నీట్ గా ఎడిటింగ్ చేసుకుని రెండు భాగాలుగా రిలీజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొంత భాగం షూటింగ్ చేసి ఫైనల్ కట్ కి సిద్ధం చేసుకోవాలి. నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ గతంలో ఈ విషయాన్ని చూచాయగా చెప్పినా నిర్ధారణగా చెప్పకపోవడంతో స్పష్టత రాలేదు. ఇప్పుడు కమల్ స్వయంగా క్లూస్ ఇవ్వడంతో అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. మరి గేమ్ ఛేంజర్ సంగతేంటని మెగా ఫ్యాన్స్ అడిగితే సమాధానం ఎవరి దగ్గరా లేదు.
వచ్చే ఏడాది వేసవి లోగా శంకర్ కమల్, చరణ్ ఇద్దరివీ పూర్తి చేసి ఫ్రీ అయ్యే ఆలోచనలో ఉన్నాడు. తర్వాత రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ చేయాల్సి ఉంది. దాన్నెప్పుడో అఫీషియల్ గా ప్రకటించారు కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా తీస్తారో లేదో తెలియదు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ విడుదల తేదీలు మాత్రం ఇప్పట్లో తేలే సూచనలు లేవు. చెన్నై వర్గాల ప్రకారం ఇండియన్ 2 ని వేసవిలో రిలీజ్ చేస్తారని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర సమాచారం ఉందట. అధికారికంగా 2024 సంక్రాంతికి ఒక కొత్త టీజర్ తో ప్రకటించే అవకాశం ఉంది. ఎదురు చూడటం తప్ప వేరే ఆప్షన్ లేదు.
This post was last modified on November 8, 2023 8:13 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…