మా ఊరి పొలిమేర.. కరోనా టైంలో నేరుగా హాట్ స్టార్ ఓటీటీలో రిలీజైన సినిమా. ఆ చిత్రం మొదలుపెట్టి కాసేపు చూస్తే.. ఇదేం సినిమారా బాబూ అనిపిస్తుంది. చేతబడుల చుట్టూ కథను నడిపిస్తూ.. పాత్రలతో పచ్చి బూతులు మాట్లాడిస్తూ.. కొన్ని శృంగార సన్నివేశాలను హద్దులు దాటించి.. ఇదొక బి-గ్రేడ్ మూవీ అనే ఫీలింగ్ కలిగిస్తారు. కానీ మొత్తం సినిమా చూశాక అభిప్రాయం మారుతుంది.
ముఖ్యంగా సత్యం రాజేష్ పాత్ర చిత్రణ.. కథలోని మలుపులు.. ఒళ్లు గగుర్పొడిచే కొన్ని సీన్లు.. డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తాయి. ఏ పబ్లిసిటీ లేకపోయినా మౌత్ టాక్తోనే ఈ సినిమా హాట్ స్టార్లో ఊహించని స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ఆ ఓటీటీలో హైయెస్ట్ వ్యూస్ తెచ్చుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ వచ్చిన స్పందన చూసే.. ‘మా ఊరి పొలిమేర-2’ను కొంచెం పెద్ద బడ్జెట్లో థియేట్రికల్ రిలీజ్ లక్ష్యంగా తీసింది చిత్ర బృందం.
ఈసారి కథ విస్తృతి పెంచారు. క్వాలిటీ కూడా పెరిగింది. బూతులు, శృంగార సన్నివేశాలు లేకుండా థియేటర్లలో చూడదగ్గ ఫీచర్ ఫిలిం లాగా దీన్ని మలిచారు. బన్నీ వాసు ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో దీనికి మంచి రిలీజ్ కూడా దక్కింది. రిలీజ్కు ముందు అందరి దృష్టీ ‘కీడా కోలా’ మీదే ఉండగా.. ఓ మోస్తరు హైప్తో రిలీజైన ఈ సినిమా.. విడుదల తర్వాత సంచలనం రేపుతోంది. తొలి రోజు సింగిల్ స్క్రీన్లో ఈ సినిమాకు కనిపించిన ఆక్యుపెన్సీలు చూసి షాకయ్యారు ఇండస్ట్రీ జనాలు. ‘కీడా కోలా’ సందడి తొలి రోజుకే పరిమితం కాగా.. వీకెండ్ వరకు ఓ మోస్తరుగా ఆడి చల్లబడిపోయింది. కానీ ‘మా ఊరి పొలిమేర-2’ మాత్రం నిలకడగా వసూళ్లు సాధిస్తోంది.
ఆ చిత్రానికి స్క్రీన్లు, షోలు కూడా పెరిగాయి. టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. ఇందులోని ట్విస్టులు, థ్రిల్స్ టార్గెటెడ్ ఆడియన్స్ను మెప్పిస్తున్నాయి. అందుకే మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమా మీద పెట్టిన ఖర్చంతా ఒక్క నైజాం ఏరియా నుంచే వచ్చేయడం విశేషం. అన్ని ఏరియాల్లోనూ వీకెండ్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టేసింది. ఫుల్ రన్లో ఈజీగా పది కోట్ల షేర్ మార్కును దాటేసేలా ఉంది ‘పొలిమేర-2’. ఈ సక్సెస్ మూడో పార్ట్కు మరింత ఊపునిచ్చేదే. దాన్ని మరింత పెద్ద రేంజిలో, ఇంకా ఉత్కంఠభరితంగా తీస్తే పెద్ద సక్సెస్ అవడం ఖాయం.
This post was last modified on November 7, 2023 2:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…