ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ అనే పదానికి దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ రూపంలో తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుని తనలో చేవ ఇంకా అలాగే ఉందని నిరూపించారు. తెలుగులోనూ ఇది అనూహ్యంగా సక్సెస్ సాధించడంతో కమల్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడా సంతోషాన్ని రెట్టింపు చేసేలా మూడు దశాబ్దాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో చేతులు కలపడమే కాక అతి తక్కువ టైంలోనే టైటిల్ ని డిసైడ్ చేయడంతో పాటు దానికి సంబంధించిన మూడు నిమిషాల వీడియో టీజర్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేయడం విశేషం.
కథ గురించి రివీల్ చేయకపోయినా సినిమాలో కమల్ పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పేరు రంగరాయ సత్తివేల్ నాయకన్. చివరి పదం చూడగానే నాయకుడు గుర్తొచ్చేలా సెట్ చేసిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఎడారి లాంటి నిర్మానుష్యంగా ప్రదేశంలో ముఖానికి ముసుగు చుట్టుకుని ఉండగా తన మీద దాడి చేసిన ముష్కరుల గుంపుని నిర్దాక్షిణ్యంగా నరికి పారేసే ఎపిసోడ్లో రంగరాయుడు తన స్వయంగా చెప్పుకోవడం ఈ సందర్భంగా చూపించారు. స్టోరీ బ్యాక్ గ్రౌండ్ ఏ కాలంలో జరుగుతుంది, ఇది పీరియాడిక్ డ్రామానా లేక వర్తమానమా లాంటివి చెప్పలేదు
ప్రధాన హైలైట్ గా నిలిచింది మాత్రం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా గ్యాప్ తర్వాత తన స్థాయిలో బిజిఎం ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. అయితే తగ్ లైఫ్ టైటిల్ మాత్రం వెరైటీగా ఉంది. మాములుగా ఉద్యోగుల ప్రపంచంలో జీవితం ఉరుకులు పరుగులు మీద పోతోందని చెప్పడానికి సంకేతంగా దీన్ని వాడతారు. మరి మణిరత్నం తన శైలికి భిన్నంగా ఇంగ్లీష్ పేరుని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా కోసం చేసినట్టు అర్థమవుతోంది. కమల్ హాసన్ 234వ సినిమాగా రూపొందుతున్న తగ్ లైఫ్ లో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవితో పాటు భారీ తారాగణం భాగం కానుంది.
This post was last modified on November 6, 2023 6:35 pm
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…