ఎన్నో ఏళ్లుగా బ్లాక్ బస్టర్ అనే పదానికి దూరమైన లోకనాయకుడు కమల్ హాసన్ గత ఏడాది విక్రమ్ రూపంలో తిరుగులేని ఘనవిజయాన్ని సొంతం చేసుకుని తనలో చేవ ఇంకా అలాగే ఉందని నిరూపించారు. తెలుగులోనూ ఇది అనూహ్యంగా సక్సెస్ సాధించడంతో కమల్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడా సంతోషాన్ని రెట్టింపు చేసేలా మూడు దశాబ్దాల తర్వాత దర్శకుడు మణిరత్నంతో చేతులు కలపడమే కాక అతి తక్కువ టైంలోనే టైటిల్ ని డిసైడ్ చేయడంతో పాటు దానికి సంబంధించిన మూడు నిమిషాల వీడియో టీజర్ ని ప్రత్యేకంగా రిలీజ్ చేయడం విశేషం.
కథ గురించి రివీల్ చేయకపోయినా సినిమాలో కమల్ పాత్ర గురించి కొన్ని ముఖ్యమైన క్లూస్ ఇచ్చారు. ఆయన క్యారెక్టర్ పేరు రంగరాయ సత్తివేల్ నాయకన్. చివరి పదం చూడగానే నాయకుడు గుర్తొచ్చేలా సెట్ చేసిన తీరు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా ఉంది. ఎడారి లాంటి నిర్మానుష్యంగా ప్రదేశంలో ముఖానికి ముసుగు చుట్టుకుని ఉండగా తన మీద దాడి చేసిన ముష్కరుల గుంపుని నిర్దాక్షిణ్యంగా నరికి పారేసే ఎపిసోడ్లో రంగరాయుడు తన స్వయంగా చెప్పుకోవడం ఈ సందర్భంగా చూపించారు. స్టోరీ బ్యాక్ గ్రౌండ్ ఏ కాలంలో జరుగుతుంది, ఇది పీరియాడిక్ డ్రామానా లేక వర్తమానమా లాంటివి చెప్పలేదు
ప్రధాన హైలైట్ గా నిలిచింది మాత్రం ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. చాలా గ్యాప్ తర్వాత తన స్థాయిలో బిజిఎం ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. అయితే తగ్ లైఫ్ టైటిల్ మాత్రం వెరైటీగా ఉంది. మాములుగా ఉద్యోగుల ప్రపంచంలో జీవితం ఉరుకులు పరుగులు మీద పోతోందని చెప్పడానికి సంకేతంగా దీన్ని వాడతారు. మరి మణిరత్నం తన శైలికి భిన్నంగా ఇంగ్లీష్ పేరుని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్యాన్ ఇండియా కోసం చేసినట్టు అర్థమవుతోంది. కమల్ హాసన్ 234వ సినిమాగా రూపొందుతున్న తగ్ లైఫ్ లో త్రిష, దుల్కర్ సల్మాన్, జయం రవితో పాటు భారీ తారాగణం భాగం కానుంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…