ఒకపక్క సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోషించాలో లేక దాన్ని వాడుకుని తప్పుడు పనులకు తెర తీస్తున్న కొందరిని చూసి బాధ పడాలో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా రష్మిక మందన్న మొహాన్ని తీసుకుని ఇంకో మోడల్ కి అతికించి అసభ్యంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం బాగా వైరల్ అయ్యింది. ఇది చాలా దుర్మార్గమని స్వయంగా అమితాబ్ బచ్చన్ అంతటి పెద్దవారే లీగల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపు ఇవ్వడం చూస్తే పరిస్థితి ఎంత విషమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగదు.
గతంలో సమంతా, సాయిపల్లవి, కాజల్ అగర్వాల్ లను సైతం ఇలా ఇతర వీడియోలకు మార్ఫింగ్ చేసి శునకానందం పొందిన వాళ్ళు లేకపోలేదు. తాజాగా ఏఐ(ఆర్టిఫీషియల్ టెక్నాలజీ) హవా మొదలైంది. దీనితో ఒరిజినల్ నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. దీన్ని వాడి ఆ మధ్య కొందరు గుంటూరు కారం, స్పిరిట్ పోస్టర్లు తయారు చేస్తే అవి నిజమే అనుకుని తమ ఊళ్ళలో ఫ్లెక్సిలు చేయించిన అమాయక అభిమానులున్నారు. ఇంకా హై ఎండ్ టూల్స్ వాడితే మన పెళ్లికి మహేష్ బాబు వచ్చినట్టు, బర్త్ డేకి పవన్ కళ్యాణ్ హాజరైనట్టు గ్రాఫిక్స్ సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికి అడ్డుకట్ట వేయడం సులభం కాదు. ప్రభుత్వాలు చర్యలకు పూనుకుని చట్టాలు కఠినం చేయకపోతే ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవాళ రష్మిక రేపు మరో హీరోయిన్ ఈ ప్రహసనానికి బాధితురాలిగా మారొచ్చు. ఇప్పటికి అంత సీరియస్ మ్యాటర్ అనిపించినా అనిపించకపోయినా భవిష్యత్తులో ఇలాంటివే సున్నిత మనస్కులు ఎవరినైనా ప్రాణాలు బలిపెట్టే దాకా వెళ్లొచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యాప్స్ సహాయంతో విచ్చలవిడిగా ఇలాంటి కంటెంట్ సృష్టించే సౌలభ్యం ఉన్న వాతావరణంలో కట్టడి చేయడం సవాలే. చైనా, జపాన్ లాంటి నియమాలు పెడితే తప్ప మార్పు రాదేమో.
This post was last modified on November 6, 2023 2:25 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…