ఒకపక్క సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోషించాలో లేక దాన్ని వాడుకుని తప్పుడు పనులకు తెర తీస్తున్న కొందరిని చూసి బాధ పడాలో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా రష్మిక మందన్న మొహాన్ని తీసుకుని ఇంకో మోడల్ కి అతికించి అసభ్యంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం బాగా వైరల్ అయ్యింది. ఇది చాలా దుర్మార్గమని స్వయంగా అమితాబ్ బచ్చన్ అంతటి పెద్దవారే లీగల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపు ఇవ్వడం చూస్తే పరిస్థితి ఎంత విషమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగదు.
గతంలో సమంతా, సాయిపల్లవి, కాజల్ అగర్వాల్ లను సైతం ఇలా ఇతర వీడియోలకు మార్ఫింగ్ చేసి శునకానందం పొందిన వాళ్ళు లేకపోలేదు. తాజాగా ఏఐ(ఆర్టిఫీషియల్ టెక్నాలజీ) హవా మొదలైంది. దీనితో ఒరిజినల్ నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. దీన్ని వాడి ఆ మధ్య కొందరు గుంటూరు కారం, స్పిరిట్ పోస్టర్లు తయారు చేస్తే అవి నిజమే అనుకుని తమ ఊళ్ళలో ఫ్లెక్సిలు చేయించిన అమాయక అభిమానులున్నారు. ఇంకా హై ఎండ్ టూల్స్ వాడితే మన పెళ్లికి మహేష్ బాబు వచ్చినట్టు, బర్త్ డేకి పవన్ కళ్యాణ్ హాజరైనట్టు గ్రాఫిక్స్ సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికి అడ్డుకట్ట వేయడం సులభం కాదు. ప్రభుత్వాలు చర్యలకు పూనుకుని చట్టాలు కఠినం చేయకపోతే ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవాళ రష్మిక రేపు మరో హీరోయిన్ ఈ ప్రహసనానికి బాధితురాలిగా మారొచ్చు. ఇప్పటికి అంత సీరియస్ మ్యాటర్ అనిపించినా అనిపించకపోయినా భవిష్యత్తులో ఇలాంటివే సున్నిత మనస్కులు ఎవరినైనా ప్రాణాలు బలిపెట్టే దాకా వెళ్లొచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యాప్స్ సహాయంతో విచ్చలవిడిగా ఇలాంటి కంటెంట్ సృష్టించే సౌలభ్యం ఉన్న వాతావరణంలో కట్టడి చేయడం సవాలే. చైనా, జపాన్ లాంటి నియమాలు పెడితే తప్ప మార్పు రాదేమో.
This post was last modified on November 6, 2023 2:25 pm
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…