ఒకపక్క సాంకేతికత అభివృద్ధి చెందినందుకు సంతోషించాలో లేక దాన్ని వాడుకుని తప్పుడు పనులకు తెర తీస్తున్న కొందరిని చూసి బాధ పడాలో అర్థం కాని అయోమయం నెలకొంటోంది. మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా రష్మిక మందన్న మొహాన్ని తీసుకుని ఇంకో మోడల్ కి అతికించి అసభ్యంగా ఉన్న వీడియోని సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం బాగా వైరల్ అయ్యింది. ఇది చాలా దుర్మార్గమని స్వయంగా అమితాబ్ బచ్చన్ అంతటి పెద్దవారే లీగల్ చర్యలు తీసుకోవాల్సిందిగా పిలుపు ఇవ్వడం చూస్తే పరిస్థితి ఎంత విషమంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగదు.
గతంలో సమంతా, సాయిపల్లవి, కాజల్ అగర్వాల్ లను సైతం ఇలా ఇతర వీడియోలకు మార్ఫింగ్ చేసి శునకానందం పొందిన వాళ్ళు లేకపోలేదు. తాజాగా ఏఐ(ఆర్టిఫీషియల్ టెక్నాలజీ) హవా మొదలైంది. దీనితో ఒరిజినల్ నకిలీ ఏదో గుర్తు పట్టడం కష్టంగా ఉంది. దీన్ని వాడి ఆ మధ్య కొందరు గుంటూరు కారం, స్పిరిట్ పోస్టర్లు తయారు చేస్తే అవి నిజమే అనుకుని తమ ఊళ్ళలో ఫ్లెక్సిలు చేయించిన అమాయక అభిమానులున్నారు. ఇంకా హై ఎండ్ టూల్స్ వాడితే మన పెళ్లికి మహేష్ బాబు వచ్చినట్టు, బర్త్ డేకి పవన్ కళ్యాణ్ హాజరైనట్టు గ్రాఫిక్స్ సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
దీనికి అడ్డుకట్ట వేయడం సులభం కాదు. ప్రభుత్వాలు చర్యలకు పూనుకుని చట్టాలు కఠినం చేయకపోతే ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇవాళ రష్మిక రేపు మరో హీరోయిన్ ఈ ప్రహసనానికి బాధితురాలిగా మారొచ్చు. ఇప్పటికి అంత సీరియస్ మ్యాటర్ అనిపించినా అనిపించకపోయినా భవిష్యత్తులో ఇలాంటివే సున్నిత మనస్కులు ఎవరినైనా ప్రాణాలు బలిపెట్టే దాకా వెళ్లొచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు యాప్స్ సహాయంతో విచ్చలవిడిగా ఇలాంటి కంటెంట్ సృష్టించే సౌలభ్యం ఉన్న వాతావరణంలో కట్టడి చేయడం సవాలే. చైనా, జపాన్ లాంటి నియమాలు పెడితే తప్ప మార్పు రాదేమో.
This post was last modified on November 6, 2023 2:25 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…