స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కొన్ని ప్రచారాలు అభిమానులను విపరీతమైన ఆందోళనకు గురి చేస్తాయి. సలార్ డిసెంబర్ 22 నుంచి మళ్ళీ వాయిదా పడొచ్చనే ప్రచారం నిన్న కొన్ని మీడియా వర్గాల్లో జరగడం చూసి ఫ్యాన్స్ హడావిడి పడిపోయి సోషల్ మీడియాలో తమ నిరసనని వ్యక్తం చేశారు. డుంకి ప్రోమో వచ్చాక కూడా సలార్ కనీసం ప్రభాస్ కనిపించే టీజర్ వదలకపోవడం పట్ల ఇప్పటికే బోలెడు అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ పోస్ట్ పోన్ అంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అయితే నిర్మాణ వర్గాలు మాత్రం వీటిని పూర్తిగా కొట్టి పారేస్తున్నాయి. వాయిదా సమస్యే లేదంటున్నాయి.
విడుదల తేదీకు అనుగుణంగా బిజినెస్ వ్యవహారాలు, థియేటర్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాక్ అవుతున్నారు. సంక్రాంతి సినిమాలకే కేటాయింపులు జరుగుతున్న తరుణంలో వాటికి ఇరవై రోజుల ముందు వస్తున్న సలార్ ని ఊరికే వదిలేస్తారా. షారుఖ్ ఖాన్ ఓవర్సీస్ లో ప్రభావం చూపించే మాట వాస్తవమే అయినా హోంబాలే ఫిలింస్ ఎంత మాత్రం తగ్గే ఆలోచనలో లేరు. పైగా ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ వేసవి దాకా స్లాట్ దొరకదు. ఒకసారి జరిగిన వాయిదాకే ఇతర టాలీవుడ్ నిర్మాతలు తమ ప్లానింగ్ మార్చుకుని నానా రకాల ఇబ్బందులు పడ్డారు.
సో సలార్ తప్పుకోవడమనే మాట ఉత్తుత్తిదే. దీపావళికి కొత్త టీజర్ ఆశిస్తున్న అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒత్తిడి మధ్య జరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్, రవి బస్రూర్ తో పాటు ఎడిటింగ్ టీమ్ మొత్తం ఫైనల్ కాపీని సిద్ధం చేసే దిశగా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ అయ్యాకే సలార్ పబ్లిసిటీ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎలాగూ ఇండియా ఫైనల్ కు వెళ్తుంది కాబట్టి ఆ హడావిడిలో సినిమాలను పట్టించుకోరు. అందుకే నవంబర్ 20 నుంచి ఏ నిమిషంలో అయినా సలార్ దూకుడు మొదలవ్వొచ్చు.
This post was last modified on November 6, 2023 1:23 pm
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…
ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…
ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…
ఐపీఎల్లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…