బేబి.. గత కొన్నేళ్లలో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనంగా చెప్పుకోవాలి. ఈ సినిమాతో చాలామంది జీవితాలు మారిపోయాయి. దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ కలిసి వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. వీరి కలయికలో నాలుగు సినిమాలు రాబోతున్నాయి. హీరోయిన్ వైష్ణవి చైతన్య చేతికి మూణ్నాలుగు ప్రాజెక్టులు వచ్చినట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండ సైతం బిజీ అవుతున్నాడు.
ఆల్రెడీ ఆనంద్-వైష్ణవి కలయికలో సాయిరాజేష్-ఎస్కేఎన్ కలిసి ఒక సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఆరంభంలోనే మంచి క్రేజ్ వచ్చింది. ఇది కాక ఆల్రెడీ ఆనంద్ చేతిలో ‘గం గం గణేష’తో పాటు మరో సినిమా ఉంది. ఇప్పుడు కొత్తగా ఇంకో సినిమాను మొదలు పెట్టాడు ఆనంద్. ఆ చిత్రం కొంచెం పెద్ద స్థాయిలోనే తెరకెక్కబోతోంది. ఆనంద్ కెరీర్లో హైయెస్ట్ బడ్జెట్ ఈ సినిమా మీదే పెడుతున్నారు.
ఆనంద్ కొత్త సినిమా పేరు.. డ్యూయెట్. ఈ పేరు వినగానే 90వ దశకంలో రెహమాన్ అద్భుతమైన సంగీతం అందించిన ఒక లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ‘అంజలి అంజలి’ అనే పాట ఎంత పాపులరో తెలిసిందే. ఈ టైటిల్తో మిథున్ వరదరాజా అనే దర్శకుడు ఆనంద్తో సినిమా తీస్తున్నాడు. తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన స్టూడియో గ్రీన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటించబోతోంది. జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించనున్నాడంటే ఇది ఒక రేంజ్ ఉన్న సినిమానే అని అర్థం చేసుకోవచ్చు. ఇండియాతో పాటు ఫారిన్ లొకేషన్లలోనూ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కాంబినేషన్ అదీ చూస్తుంటే ఆనంద్ కెరీర్ను కొన్ని మెట్లు ఎక్కించే సినిమాలా కనిపిస్తోంది.
This post was last modified on November 2, 2023 5:41 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…