బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన జవాన్ ని ఎప్పుడెప్పుడు ఓటిటిలో రిపీట్ షోలు చూద్దామా అని అభిమానులు వారాల తరబడి ఎదురు చూస్తూ వచ్చారు. రెండు నెలల ఒప్పందం పూర్తయిపోవడంతో షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా నెట్ ఫ్లిక్స్ నవంబర్ 2 అంటే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ మొదలుపెట్టింది. ఎక్స్ టెండెడ్ కట్ వెర్షన్ అంటూ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసింది. అంతే థియేటర్ కాపీ కాకుండా అదనంగా పక్కన పెట్టిన ఎడిటింగ్ ఫుటేజ్ ఇందులో కలుపుతారని దాని ఉద్దేశం. దీంతో ఇంకేం స్పెషల్ ఉందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఫోన్లు, టీవీలో షోలు వేసుకున్నారు.
తీరా చూస్తే ఇదంతా ఉత్తుత్తి బిల్డపని అర్థమైపోయింది. డిజిటల్ వెర్షన్ జవాన్ 170 నిమిషాలే ఉంది. అంటే మనం తెరమీద చూసిన దానికి ఈ ప్రింట్ కి కేవలం రెండు మూడు నిమిషాలే తేడా. ఆ కాసింత సన్నివేశాలు ఏవో కూడా గుర్తుపట్టలేనంతగా కలిపేశారు. దీంతో నిరాశ తప్పలేదు. గతంలో పఠాన్ కు సైతం ప్రైమ్ ఇలాగే చేసింది. నిజానికి కత్తెరకు బలైన జవాన్ భాగంలో నయనతార సీన్లు చాలా ఉన్నాయి. వాటితో పాటు ఇద్దరు షారుఖ్ లు కలుసుకున్నాక జరిగే సంఘటనలు ఇంకొన్ని పెట్టాడు దర్శకుడు ఆట్లీ. అవన్నీ నెట్ ఫ్లిక్స్ లో చూసుకోవచ్చనుకుంటే ఇదిగో ఇలా ట్విస్టు ఇచ్చారు.
దీని సంగతి ఎలా ఉన్నా వ్యూస్ పరంగా నెట్ ఫ్లిక్స్ పంట పండబోతోంది. దేశ్ విదేశాల్లో మిలియన్ల వ్యూస్ జవాన్ కి పోటెత్తబోతున్నాయి. ఈ మధ్య ఇండియన్ కంటెంట్ అందులోనూ సౌత్ సినిమాలకు గ్లోబల్ గా మంచి ఆదరణ దక్కుతోంది. వారాల తరబడి మనవి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. భోళా శంకర్, రామబాణం లాంటి అల్ట్రా డిజాస్టర్లు సైతం కేవలం నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన కారణంగానే పది రోజులు టాప్ టెన్ లో ఉన్నాయి. అలాంటిది జవాన్ చేయబోయే అరాచకం నెక్స్ట్ లెవెల్ లో ఉండటం ఖాయం. ఫైనల్ గా ఎక్స్ టెండెడ్ జవాన్ ని ఎక్కువ ఊహించుకున్న షారుఖ్, నయన్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.
This post was last modified on November 2, 2023 4:07 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…