దేశంలో రాజకీయాలు, సినిమాలు బాగా కలిసిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఉన్నారు కానీ.. తమిళనాట అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే చాలా ఏళ్లు అధికారం చలాయించారు. చలాయిస్తున్నారు. యం.జి.ఆర్, కరుణానిధి, జయలలిత.. ఎలా తమిళ రాజకీయాలను ప్రభావితం చేశారో.. అధికారం చలాయించారో తెలిసిందే.
ఈ కోవలో విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టారు కానీ.. అనుకున్నంతగా విజయవంతం కాలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి.. అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. ఇక అందరి చూపూ విజయ్ మీదే ఉంది. కొంత కాలంగా తాను రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలను బలంగా పంపుతున్నాడు విజయ్.
తాజాగా ‘లియో’ సక్సెస్ మీట్ చూసిన వాళ్లకు ఇంకా స్ట్రాంగ్ ఇండికేషన్స్ కనిపించాయి. తాను జనాలను నడిపించే దళపతిని అవుతా అంటూ తన ప్రసంగాన్ని ముగించేటపుడు అన్న మాట రాజకీయారంగేట్రం సంకేతాలను బలంగా ఇచ్చింది. దీని కంటే కూడా స్టేజ్ మీద యాంకర్ అడిగిన ఒక ప్రశ్న అందరి దృష్టినీ ఆకర్షించింది. 2026 గురించి మీరేమంటారు అని యాంకర్ అడిగితే.. ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది. ఆ సంవత్సరమే తమిళనాడు తర్వాతి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ జవాబు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ముందు అతను దీనిపై సరదాగా స్పందించాడు. 2025 తర్వాత వచ్చే సంవత్సరం 2026 అన్నాడు. తర్వాత ఆ సంవత్సరం ఫుట్బల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. చివరగా యాంకర్ సీరియస్గా సమాధానం చెప్పండి అని అడిగితే.. ‘‘కప్పు ముఖ్యం బిగిలూ’’ అంటూ తన సినిమాలోని ఒక డైలాగ్ పేల్చాడు. సూటిగా సమాధానం చెప్పకపోయినా.. ఎన్నికల్లో బరిలోకి దిగడం, విజయం సాధించడం తన లక్ష్యం అనే సంకేతాలను విజయ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
This post was last modified on November 2, 2023 2:50 pm
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…
ఏదో ఈవెంట్కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…