దేశంలో రాజకీయాలు, సినిమాలు బాగా కలిసిపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖులు ఉన్నారు కానీ.. తమిళనాట అయితే ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే చాలా ఏళ్లు అధికారం చలాయించారు. చలాయిస్తున్నారు. యం.జి.ఆర్, కరుణానిధి, జయలలిత.. ఎలా తమిళ రాజకీయాలను ప్రభావితం చేశారో.. అధికారం చలాయించారో తెలిసిందే.
ఈ కోవలో విజయ్ కాంత్, కమల్ హాసన్ కూడా ఈ రంగంలోకి అడుగు పెట్టారు కానీ.. అనుకున్నంతగా విజయవంతం కాలేదు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి.. అనారోగ్య కారణాలతో తప్పుకున్నారు. ఇక అందరి చూపూ విజయ్ మీదే ఉంది. కొంత కాలంగా తాను రాజకీయాల్లోకి రాబోతున్న సంకేతాలను బలంగా పంపుతున్నాడు విజయ్.
తాజాగా ‘లియో’ సక్సెస్ మీట్ చూసిన వాళ్లకు ఇంకా స్ట్రాంగ్ ఇండికేషన్స్ కనిపించాయి. తాను జనాలను నడిపించే దళపతిని అవుతా అంటూ తన ప్రసంగాన్ని ముగించేటపుడు అన్న మాట రాజకీయారంగేట్రం సంకేతాలను బలంగా ఇచ్చింది. దీని కంటే కూడా స్టేజ్ మీద యాంకర్ అడిగిన ఒక ప్రశ్న అందరి దృష్టినీ ఆకర్షించింది. 2026 గురించి మీరేమంటారు అని యాంకర్ అడిగితే.. ఒక్కసారిగా ఆడిటోరియం హోరెత్తింది. ఆ సంవత్సరమే తమిళనాడు తర్వాతి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ నేపథ్యంలో విజయ్ జవాబు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ముందు అతను దీనిపై సరదాగా స్పందించాడు. 2025 తర్వాత వచ్చే సంవత్సరం 2026 అన్నాడు. తర్వాత ఆ సంవత్సరం ఫుట్బల్ వరల్డ్ కప్ జరుగుతుందన్నాడు. చివరగా యాంకర్ సీరియస్గా సమాధానం చెప్పండి అని అడిగితే.. ‘‘కప్పు ముఖ్యం బిగిలూ’’ అంటూ తన సినిమాలోని ఒక డైలాగ్ పేల్చాడు. సూటిగా సమాధానం చెప్పకపోయినా.. ఎన్నికల్లో బరిలోకి దిగడం, విజయం సాధించడం తన లక్ష్యం అనే సంకేతాలను విజయ్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు.
This post was last modified on November 2, 2023 2:50 pm
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…