మొన్న ఆదివారం విశ్వక్ సేన్ తన గ్యాంగ్స్ అఫ్ గోదావరి విడుదల గురించి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఎంత రచ్చ చేసిందో చూస్తున్నాం. కొంతసేపయ్యాక డిలీట్ చేశాడు కానీ అప్పటికే అది విపరీతంగా వైరల్ అయిపోయి ఇండస్ట్రీలోనే కాదు సగటు ప్రేక్షకుల్లోనూ చర్చను లేవనెత్తింది. ఒకవేళ సినిమా కనక డిసెంబర్ లో రిలీజ్ కాకపోతే ప్రమోషన్లలో తనను చూడరని శపథం చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. అయితే విశ్వక్ ఇలా వివాదాలు, వార్తల్లో నలగడం ముందు నుంచి ఉన్నదే. అసలేం జరిగిందనే దాని మీద నిర్మాత నాగవంశీ వైపు నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది.
గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదాకు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదు. ఇంకో పాట షూటింగ్ బ్యాలన్స్ ఉంది. అదయ్యాక ఫైనల్ కాపీని హీరో నిర్మాత చూసుకుని ఇద్దరూ సంతృప్తి చెందితే అప్పుడు వెనుకడుగు వేయాలా వద్దా అనేది డిసైడ్ అవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు కాదు. అయినా గ్యాంగ్స్ అఫ్ గోదావరికి సరిపడా బజ్ ఉంది. ముందు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నప్పుడు పోటీలో వరుణ్ తేజ్ వాలెంటైన్ మాత్రమే ఉంది. సలార్ వల్ల హాయ్ నాన్న, ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లు ముందుకొచ్చాయి. దీని వల్ల తన సినిమా ఏమైనా కిందకు వెళ్తుందేమోనని విశ్వక్ అనుమానపడ్డాడు.
ఈ క్రమంలో ఇన్స్ టాలో హెచ్చరిక లాంటి మెసేజ్ పెట్టాడు తప్పించి ఏదీ ప్లాన్ ప్రకారం జరిగింది కాదు. ఇదంతా నిర్మాత నాగ వంశీ చెప్పుకొచ్చిన వెర్షనే. విశ్వక్ నుంచి క్లారిటీ రావాలంటే ఏదైనా ఈవెంట్ లో చెప్పాలి లేదా గ్యాంగ్స్ అఫ్ గోదావరి ప్రమోషన్లలో మీడియాని కలిసినప్పుడు మాట్లాడాలి. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ విలేజ్ మాఫియా డ్రామా కోసం విశ్వక్ హెయిర్ స్టైల్ ని పూర్తిగా మార్చుకుని కొత్తగా కనిపిస్తున్నాడు. డిసెంబర్ 29కి వెళ్లొచ్చనే ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతానికి ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. ఈ సస్పెన్స్ ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. చూద్దాం.
This post was last modified on November 1, 2023 7:09 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…