సంక్రాంతి పోటీ గురించి ఇంకా రెండు నెలలకు పైగానే సమయం ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో దీని గురించిన వాడివేడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బింగ్ తో కలిపి ఏకంగా ఆరేడు సినిమాలు ఎవరికి వారు తగ్గేదేలే అంటూ పంతం పట్టడంతో థియేటర్ల సర్దుబాటు గురించి డిస్ట్రిబ్యూటర్లలో ఇప్పటి నుంచే టెన్షన్ మొదలైంది. అన్నీ పెద్ద ప్రొడ్యూసర్లవే. అందరూ స్టార్ హీరోలే. హనుమాన్ కథానాయకుడు తేజ సజ్జ పెద్ద రేంజ్ కాకపోయినా అందులో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ కి ప్యాన్ ఇండియా బ్రాండ్ పడింది. నిర్మాత నాగవంశీ తాజాగా ఈ పరిణామాలు, గుంటూరు కారం గురించి మాట్లాడారు.
పండగకు ఇన్నేసి సినిమాలు రావడం పట్ల తనకెలాంటి ఫీలింగ్ లేదని, అందరి ఛాయస్ గుంటూరు కారం అయినప్పుడు తానెందుకు ఇతర ప్రొడ్యూసర్లని కలవాలంటూ తేల్చి చెప్పారు. కావాలంటే వాళ్లొచ్చి మాట్లాడితే వింటాను తప్ప రిలీజుల విషయంలో తాను చేయగలిగింది ఏమి లేదనే రీతిలో కుండబద్దలు కొట్టారు. తొలి ఆడియో సింగల్ కూడా నవంబర్ మొదటి వారం అనేశారు కానీ ఆల్రెడీ ఫస్ట్ వీక్ మొదలైన నేపథ్యంలో ఈ ఆరు రోజుల్లో నిజంగా విడుదల చేస్తారానేది అనుమానంగానే ఉంది. గత నెల తమన్ సైతం నవంబర్ నుంచి మహేష్ సందడి ఉంటుందని క్లూస్ ఇచ్చాడు.
రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉంటాబోతున్నాయి. మరోవైపు ఈగల్ జనవరి 13 నుంచి 26కి షిఫ్ట్ అయ్యిందనే వార్తలను రవితేజ నిర్మాతలు ఖండిస్తూ సంకేతాలు పంపిస్తున్నారు. తాము రేస్ లోనే ఉన్నామని వాయిదా సమస్యే లేదనే రీతిలో నొక్కి వక్కాణిస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎంత బలంగా చెప్పుకున్నా ఎప్పటికప్పుడు మారిపోయే పరిస్థితుల్లో ఏ నిమిషంలో ఏ నిర్ణయాలు వస్తాయో చెప్పలేం. నిన్నటిదాకా రిలీజ్ డేట్ల మీద కట్టుబడి ఉన్న ఆదికేశవ, డెవిల్ లు హఠాత్తుగా పక్కకు తప్పుకోవడం ఇవాళే చూశాం. సో రెండు నెలల్లో బోలెడు అప్డేట్స్ ఫ్యాన్స్ మీద దండెత్తబోతున్నాయి
This post was last modified on November 1, 2023 4:13 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…