పెళ్ళిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి వస్తున్న కొత్త సినిమా.. కీడా కోలా. చేసింది రెండు సినిమాలే అయినా యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు తరుణ్. అందుకే తన కొత్త సినిమా మీద కూడా యువ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. అతడి సినిమా అంటే కొత్తగా, క్రేజీగా ఉంటుందని ఆశిస్తారు ప్రేక్షకులు. కీడా కోలా అనే టైటిల్తోనే అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఈ సినిమా టీజర్, ట్రైలర్ కూడా కొత్తగా, క్రేజీగానే కనిపించాయి. ప్రోమోలు చూస్తే కథ మీద పెద్దగా ఐడియా రాలేదు కానీ.. ఒక కూల్ డ్రింక్ బాటిల్ చుట్టూ తిరిగే కథ ఇదని మాత్రం అర్థమైంది. ఐతే కథ గురించి పూర్తి డీటైల్స్ చెప్పకపోయినా.. ఈ కథకు పునాది ఏంటో, కోర్ ప్లాట్ పాయింట్ ఏంటో ‘కీడా కోలా’ మీడియా ఇంటర్వ్యూల్లో తరుణ్ భాస్కర్ బయటపెట్టేశాడు. కరోనా సమయంలో పరిస్థితులు చూసి ఈ కథ రాసుకున్నట్లు తరుణ్ వెల్లడించాడు.
కరోనా టైంలో జనాలు ఆర్థికంగా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. డబ్బులు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారని.. అందులో భాగంగా ఒక వ్యక్తి మ్యాన్ హోల్ మూత తీసి ఇనుప సామాన్ల వాళ్లకు అమ్మేశాడనే వార్తను తాను మీడియాలో చదివానని.. ఆ ఘటన నుంచి పుట్టిన కథే ‘కీడా కోలా’ అని చెప్పాడు తరుణ్. వక్ర మార్గంలో డబ్బులు సంపాదించాలనుకునే ఒక యువకుడు.. తాను తాకే కూల్ డ్రింక్లో పురుగు పడిందని కేసు వేస్తాడని.. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటన్నదే ఈ సినిమా అని తరుణ్ వెల్లడించాడు.
చిన్నప్పట్నుంచి తనకు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా ఇష్టమని.. ‘మనీ’, ‘మనీ మనీ’ సినిమాలను ఎన్నిసార్లు చూశానో లెక్క లేదని తరుణ్ తెలిపాడు. తమిళంలో వచ్చిన సూదుకవ్వుం, జిగర్తండ సినిమాలు కూడా తనను ఎంతగానో ప్రభావితం చేశాయని.. ఎట్టకేలకు తనకెంతో నచ్చిన జానర్లో ‘కీడా కోలా’ తీశానని.. ఇది కచ్చితంగా ప్రేక్షకులను నవ్విస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…